Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

ఇజ్రాయిల్‌లో మిన్నంటిన ప్రజాందోళన

. న్యాయ సంస్కరణలపై నిరసనల్లో పాల్గొన్న లక్షలాది మంది
. జలఫిరంగులతో అడ్డుకున్న పోలీసులు

టెల్‌అవీవ్‌ : వివాదాస్పద న్యాయ సంస్కరణలపై ఇజ్రాయిల్‌ అట్టుడికిపోతోంది. ప్రజాందోళన మిన్నంటింది. 11 వారాలుగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. దేశ ప్రభుత్వ వైఖరి, విధానాలను ఆందోళనకారులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. తాజాగా రాజధాని టెల్‌ అవీవ్‌లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలలో 2,60,000 మంది పాల్గొన్నారు. శనివారం రాజధానిలో జరిగిన ప్రదర్శనలో 1,75వేల మంది పాల్గొనగా ఇతర నగరాల్లో 85వేల మందికిపైగా పాల్గొని నిరసన వ్యక్తంచేశారు. ఒక్క జెరూసలేంలోనే అధ్యక్షుడి నివాసం వద్ద 10వేల మంది ఆందోళన చేశారు. ఉత్తర ఇజ్రాయిల్‌లో నిరసనలు మిన్నంటిన క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు జలఫిరంగులను పోలీసులు వినియోగించారు. టెల్‌ అవీవ్‌లోని అయాలన్‌ హైవే దిగ్బంధానికి యత్నించిన అనేకమంది నిరసనకారులను నిర్బంధించారు. ఆందోళనలపై ఉక్కుపాదం మోపాలంటూ పోలీసులకు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు శుక్రవారం ఆదేశాలిచ్చిన క్రమంలో శని,ఆదివారాల్లో జరిగిన నిరసనల్లో పోలీసులు దూకుడు ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img