టెహ్రాన్: ఇరాన్ తొమ్మిదో అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం టెహ్రాన్ పార్లమెంటులో జరిగినట్లు అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తాసంస్థ పేర్కొంది. కార్యక్రమాన్ని అగ్రస్థాయి అధికారులు, సైన్యాధికారులతో పాటు 88 దేశాలు, పది అంతర్జాతీయ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం పెజెష్కియన్ ప్రసంగించారు. తన ప్రభుత్వ లక్ష్యాలను తెలిపారు. ఇరాన్ ఆర్థికాభివృద్ధి, దేశ ప్రయోజనాలు, పౌరుల జీవితాల మెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని సంకల్పించారు. కీలకమైన విదేశీ విధానాల ఉద్దేశాలను ప్రధానంగా వెల్లడిరచారు. గాజాలో ఇజ్రాయిల్ చర్యలను ఖండిరచారు. పిల్లలు, మహిళలు సహా పౌరుల జీవితాలను దుర్భరం చేసే బాంబు దాడులను, వాటిని సమర్థించే వారిని తీవ్రంగా ఆక్షేపించారు. జులై 6న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పెజెష్కియన్ (69) విజేతగా నిలిచారు. ఆయనను తొమ్మిదో దేశాధ్యక్షుడిగా అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ ఆదివారం ప్రకటించారు. దీంతో తాను ప్రతిపాదించిన కేబినెట్కు పార్లమెంటు ఆమోదం పొందేందుకుగాను పెజెష్కియన్కు 15 రోజుల సమయం ఉన్నది.