పోర్చుగల్ : పోర్చుగల్ కమ్యూనిస్టుపార్టీ(పీసీపీ) వార్షికోత్సవ మహాసభలు సీక్సల్లోని క్వింటా డా అటాలియాలో ఘనంగా జరిగాయి. ఈ నెల 3,4,5 తేదీల్లో జరిగిన వార్షికోత్సవ సమావేశాలకు నాలుగు ఖండాల నుండి 40కిపైగా అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రగతిశీల శక్తులు, కమ్యూనిస్టు కార్యకర్తలు హాజరయ్యారు. 5వ తేదీన జరిగిన ముగింపు సమావేశంలో పోర్చుగల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జెరోనిమో డి సౌసా ప్రసంగించారు. భవిష్యత్తు నిర్మాణానికి, విలువలు, ఆదర్శాలకు పీసీబీ విధానాలు ఆచరణాత్మకమని సౌసా పేర్కొన్నారు. పోర్చుగల్లో ఇటువంటి ప్రత్యేకమైన భారీ ప్రదర్శన మరొకటి జరగలేదన్నారు. కార్మికులకు, ప్రజలకు, ప్రపంచ ప్రజల విముక్తి పోరాటాలకు పోర్చుగల్ కమ్యూనిస్టు పార్టీ తోడ్పాటు నిస్తుందని సంఫీుభావాన్ని ప్రకటించింది. పీసీపీ అధికారిక వార్తా పత్రిక ‘అవంతే’ తమకు తోడ్పాటునందించిందని అభినందించారు. 1976లో స్థాపించిన అవంతే పత్రిక పోర్చుగల్ నలుమూలల నుండి యువకులు, మహిళలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను, అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించే సాంస్కృతిక, రాజకీయ పత్రికగా కమ్యూనిస్టు భావజాలంతో విజయవంతంగా నడుస్తోందని పేర్కొన్నారు.