. ప్రపంచ శక్తులకు జిన్పింగ్ పిలుపు
. హంగేరి ప్రధానిని కలిసిన చైనా అధ్యక్షుడు
బీజింగ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగేందుకు సహకరించాలని ప్రపంచ శక్తులకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. జిన్పింగ్ సోమవారం హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బన్తో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నేరుగా చర్చలు, సంప్రదింపులను పునరుద్ధరించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. హంగేరి ప్రధాని ఓర్బన్… చైనాలో ఆకస్మికంగా పర్యటించారు. ఆయన గత వారం ఇదే తరహాలో రష్యా, ఉక్రెయిన్ దేశాల్లోనూ పర్యటించారు. ఉక్రెయిన్రష్యా సమస్యకు శాంతియుత పరిష్కారం దిశగా అనేక అంశాలను సమీక్షించారు. దేశాధినేతలతో చర్చించారు. శాంతి స్థాపనకు చైనా నిర్మాణాత్మక చర్యలను ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయి కుదుపులను తట్టుకొనే శక్తిగా బీజింగ్ ఉందన్నారు. ఉక్రెయిన్
రష్యా యుద్ధం ముగించే నిర్ణయం ఆ రెండు దేశాలపైనే కాక మూడు ప్రపంచ శక్తులైన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్పైనా ఆధారపడి ఉందని ఓర్బన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టారు. జిన్పింగ్తో కరచాలనం చేసిన ఫొటోను పంచుకున్నారు. ‘శాంతి మిషన్ 3.0’ అని క్యాప్షన్ జోడిరచారు.