కారకాస్: వెనిజులాలోని ఆంగోస్టురా నగరంలో లా పరాగ్వా వద్ద ఉన్న గని కూలి 23 మంది చనిపోగా మరో 11 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగినట్లు వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో వెల్లడిరచారు. భూతల, వైమానిక సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గనిలో చిక్కుకుపోయిన మైనర్లను గుర్తించే కసరత్తు జరుగుతోందన్నారు. పౌర రక్షణ బృందాలను రంగంలోకి దించినట్లు బొలివర్ రాష్ట్ర గవర్నర్ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడిరచారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లు టీవీ మాధ్యమంగా మదురో తెలిపారు. డ్రిల్లింగ్ జరిగిన క్రమంలో 30 మీటర్ల మేర గని కూలినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.