చైనా పర్యటనలో బంగ్లాదేశ్ ప్రధాని జిన్పింగ్తో భేటీ
బీజింగ్: తమ దేశాల సహకార, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చైనా పర్యటనకు వెళ్లారు. బీజింగ్కు చేరుకున్న ఆమెకు అక్కడ ఘనస్వాగతం లభించింది. హసీనా నాలుగు రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఇదే క్రమంలో ఆమె బుధవారం బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రధాని లీ కియాంగ్తో వేర్వేరుగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. తమ ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలనూ చర్చించారు.
హసీనా పర్యటన సందర్భంగా గతంలో సంతకాలు జరిగిన 2022 అవగాహన ఒప్పందాలను పునరుద్ధరించుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక
బ్యాంకింగ్ రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నియంత్రణలో సహకారం, 6వ, 9వ బంగ్లాదేశ్`చైనా స్నేహ వంతెనల నిర్మాణం, బంగ్లాదేశ్ నుంచి వ్యవసాయోత్పత్తుల ఎగుమతి తదితర ఒప్పందాలు ఈ జాబితాలో ఉన్నట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ వెల్లడిరచారు. వచ్చే సంవత్సరానికి బంగ్లాదేశ్, చైనా దౌత్యబంధానికి 50ఏళ్లు అవుతాయి. రెండు దేశాల మధ్య ప్రస్తుతమున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని… సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యంగా మార్చుకోవాలని జిన్పింగ్, షేక్ హసీనా ఆకాంక్షించినట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి.