బంగ్లాదేశ్ విద్యార్థులకు గ్రీస్ యువ కమ్యూనిస్టుల సంఫీుభావం
ఏథెన్స్: విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం యత్నించడాన్ని గ్రీస్ యువ కమ్యూనిస్టులు ఆక్షేపించారు. బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళనకు సంఫీుభావాన్ని ప్రకటించారు. ఆందోళనల్లో భాగంగా వంద మందికిపైగా యువకులు ప్రాణాలు కోల్పోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వానిదే బాధ్యతని గ్రీస్ కమ్యూనిస్టు యూత్ కేంద్ర కమిటీ అంతర్జాతీయ సంబంధాల కమిటీ (కేఎన్ఈ) ఒక ప్రకటన చేసింది. జులై 1 నుంచి ఢాకా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనకు దిగారు. క్రమంగా అన్ని ప్రధాన వర్సిటీల విద్యార్థులు మద్దతిచ్చారు. దీంతో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు హసీనా ప్రభుత్వం పూనుకుంది. పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బులెట్లతో విద్యార్థులను అడ్డుకున్నారు. మొత్తం 150 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారని బంగ్లాదేశ్ ప్రకటించింది. మృతుల్లో 94 మంది 18`29 మధ్య వయస్కులు ఉన్నట్లు తెలిపింది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమైందని, ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు యత్నించిందని కేఎన్ఈ విమర్శించింది. బంగ్లాదేశ్ విద్యార్థులకు సంఫీుభావం తెలిపింది. ఢాకాలో నిరసన తెలిపే క్రమంలో బుల్లెట్ తగిలి చనిపోయిన విద్యార్థి సంఘం సభ్యులు మప్ామూదుల్ హసన్ రిజ్వీతో పాటు బాధిత కుటుంబాలకు కేఎన్ఈ సానుభూతి తెలిపింది.