తాంజానియా, జాంజిబర్ అధ్యక్షుడు హుస్సేన్
చాంగ్షా: చైనాతో సహకార బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని, పరస్పరం సహకరించుకుంటూ ముందు కెళతామని తాంజానియా, జాంజిబర్ అధ్యక్షుడు హుస్సేన్ అలీ మిన్వి అన్నారు. పూర్వకాలం నుంచి చైనా, ఆఫ్రికా మధ్య పటిష్ఠ సహకార బంధముందన్నారు. ఆదివారంతో ముగిసిన చైనా`ఆఫ్రికా ఆర్థిక, వాణిజ్య ఎక్స్పోలో పాల్గొన్న హుస్సేన్ తన చైనా పర్యటన క్రమంలో జిన్హువా వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దశాబ్దాలుగా చైనాతో సహకార బంధాన్ని కలిగివున్నట్లు తెలిపారు. ఈ వైఖరిలో ఎలాంటి మార్పులేదన్నారు. తమ సిద్ధాంతాలు అనుకూలంగానే ఉంటాయని, చైనాతో కలిసి పనిచేస్తామని, ఆ దేశంతో దగ్గర సంబంధాలను కలిగివుండటాన్ని అదృష్టంగా భావిస్తామని హుస్సేన్ అన్నారు. కొవిడ్ తర్వాత పరిస్థితుల్లో కుదేలైన చైనా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోగలగడంతో ఆఫ్రికాకూ ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. స్వీయ సమృద్ధి సాధించడమే ఆఫ్రికా దేశాల లక్ష్యమని నొక్కిచెప్పారు. ఈ క్రమంలో చైనాతో భాగస్వామ్యం తమకు అత్యంత ప్రధానమని చెప్పారు. చైనా సాధించిన విజయాలు ప్రశంసించదగినవిగా తెలిపారు. ఆర్థిక వృద్ధిరేటు మెరుగైందని, అన్ని రంగాల్లో గణనీమjైున వృద్ధి కనిపిస్తోందని చైనా దేశం గురించి చెప్పారు. చైనా ఆధునికీకరణను మెచ్చుకున్నారు. కొన్ని లక్షల మంది పేదరికం నుంచి బయట పడగలగడం చైనా సాధించిన విజయమని అన్నారు. చైనాతో తాంజానియా సహకారంతో భవిష్యత్లో అద్భుత ఫలితాలు వస్తాయని హుస్సేన్ ఆకాంక్షించారు.