Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

‘తోషిబా’లో 5 వేల మంది తొలగింపునకు రంగం సిద్ధం

టోక్కో: ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రైవేటు సంస్థల్లో సిబ్బంది తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల కారణంగా ఖర్చు తగ్గింపులో భాగంగా వివిధ సంస్థలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన అతిపెద్ద ఎలక్ట్రానిక్స్‌ సంస్థ తోషిబా తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం. టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్‌కోర్‌ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిక్కీ నివేదించింది. కాగా, జపాన్‌లో ఉద్యోగుల తొలగింపులు చాలా అరుదు. కానీ, ఈ మధ్య కాలంలో వివిధ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img