డబ్ల్యూఎఫ్టీయూ, పీఏఎంఈ
జెనీవా: నాటో అంటే యుద్ధాలు, నిరంకుశత్వమని ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్టీయూ), గ్రీస్ ఆల్ మిలిటెంట్ వర్కర్స్ ఫ్రంట్ (పీఏఎంఈ) విమర్శించాయి. వాషింగ్టన్ డీసీలో నాటో సదస్సు సందర్భంగా సైనికపరమైన జోక్యాలు, యుద్ధాలు, అంతర్జాతీయ సంబంధాల మిలటరీకరణ, సైనిక వ్యయాన్ని పెంచడం వంటివి మానుకోవాలని నాటోకు హితవు పలికారు. నాటో దళాల తీరును ఆక్షేపించాయి. నాటో ఇప్పటికే దాని వార్షిక బడ్జెట్ను 12శాతం మేర పెంచింది. అన్ని సైనిక సంకీర్ణాలను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అణ్వాస్త్రాల సంపూర్ణ నిషేధానికి పిలుపునిచ్చాయి. సామ్రాజ్యవాద సైనిక ఘర్షణలన్నింటిని ముగించాలని, మిగతా దేశాల సార్వభౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని, ప్రజల హక్కులను గౌరవించాలని నొక్కిచెప్పాయి. వివిధ దేశాలపై అమెరికా, నాటో, ఈయూ నిరంకుశత్వం, ఆంక్షలు, వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడిరచాయి. అమెరికా, నాటో, ఈయూ చర్చలు ఆయా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, కార్మికులు, కర్షకులు, ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని కార్మిక సంఘాల ప్రకటనలు పేర్కొన్నాయి. శాంతి, సుస్థిరత, సామ్రాజ్యవాద విముక్త ప్రపంచం కోసం అంతర్జాతీయ కార్మికోద్యమాలు తప్పబోవని, ఇందుకు భాగస్వాములు కావాలని మిలిటెంట్ ట్రేడ్ యూనియన్లకు డబ్ల్యూఎఫ్టీయూ పిలుపునిచ్చింది.