బోల్సనారోకు బ్రెజిల్ సుప్రీంకోర్టు ఆదేశం బ్రసెలియా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారోకు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన తన పాస్పోర్టును అధికారులకు అప్పగించాలని సుప్రీం ఫెడరల్ కోర్టు (ఎస్టీఎఫ్) ఆదేశాలిచ్చింది. తిరుగుబాటు ప్రయత్నాల్లో ఆయన పాత్రపై దర్యాప్తు క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. బోల్సనారో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2023, జనవరి 8న రాజధానిలో జరిగిన హింసపై విచారణ కొనసాగుతోంది. ఫెడరల్ పోలీసుల ‘ఆపరేషన్ టెంపస్ వెరిటాటిస్’ (అవర్ ఆఫ్ ట్రూత్)లో భాగంగా కోర్టు తీర్పు వెలువడిరది. బోల్సనారో సహచరులు, సైన్యాధికారులే లక్ష్యంగా దర్యాప్తు సాగగా 33 అరెస్టు వారెంట్లు, నాలుగు ముందస్తు అరెస్టు నుంచి రక్షణ ఉత్తర్వులు జారీ అయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఫెరడల్ పోలీసులతో సహకార ఒప్పందంపై బోల్సనారో మాజీ వ్యక్తిగత కార్యదర్శి, లెఫ్టినెంట్ కల్నల్ మౌరో సిడ్ సంతకాలు చేసిన తర్వాత ఈ ఆపరేషన్ మొదలైనట్లు సమాచారం.