విశాలాంధ్ర – గూడూరు : పెడన నియోజకవర్గం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో ఆదివారం గూడూరు – కప్పలదొడ్డి ప్రధాన రహదారి ప్రక్కన హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, వాటికి ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యక్కల. నాగరాజు మాట్లాడుతూ, మనిషి ఆరోగ్యంగా మంచి ఆక్సిజన్ స్వీకరించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన స్వచ్చమైన ఆక్సిజన్ తీసుకోలేమన్నారు. కాని ఒక చెట్టు ద్వారా ఎంతో స్వచ్చమైన ఆక్సిజన్ తీసుకోవచ్చని మరియు పచ్చని చెట్లు వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అన్నారు . ఈ కార్యక్రమంలో పేరిశెట్టి. విజయ్ కుమార్, ఊటుకూరి .రామకోటి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.