విశాలాంధ్ర – వత్సవాయి : మండలం లోని కంభంపాడు గ్రామంలో 44 లక్షల రూపాయలతో నిర్మించిన వేమవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ సభ్యులు సామినేని ఉదయభాను ప్రారంభోత్సవం చేశారు..
ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ కంభంపాడు గ్రామంలో 44 లక్షల రూపాయలతో 7 గ్రామాలకు ఉపయోగపడేలా ఈ సహకార సంఘ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు,గతంలో చాలాకాలం నాటివి 30 సహకార సంఘ భవనాలు ఉంటే నేడు మన ప్రభుత్వం వచ్చాక 28 సహకార సంఘ భవనాలకు నూతనంగా గూడెమ్స్ ఏర్పాటు చేసుకోవడం,ప్రహరీ గోడలు,లాకర్లు,ఆఫీస్ రూమ్లు,నూతన సొసైటీ భవనం ఏర్పాట్లు ఇలా అనేక రకాల కార్యక్రమాలను మన ప్రభుత్వ హయాంలో చేసుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు,ఈ ఏడు గ్రామాలలో ఉన్న ప్రజలు ఈ సహకార సంఘాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు…ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్,గ్రామ సర్పంచ్ బేతపూడి పున్నమ్మ, సొసైటీ అధ్యక్షులు నరమనేని వెంకటేష్,జడ్పిటిసి యేసుపోగు దేవమణి, మార్కపుడి గాంధీ,ఎంపీటీసీలు, వివిధ గ్రామాల నాయకులు సర్పంచులు సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.