Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న జోగి.రమేష్

విశాలాంధ్ర -గూడూరు : కృష్ణాజిల్లా ,గుడూరు మండలంలోని ఆకులమన్నాడు సచివాలయం పరిధిలోని గ్రామలు బుధవారం పెడన నియోజకవర్గ శాసనసభ్యులు గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి. రమేష్ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు . రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారుల సమక్షంలో పరిష్కారం చూపుతూ ,ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కోళ్ల లక్ష్మణరావు, ఆకులమన్నాడ వైయస్సార్సీపి గ్రామ కన్వీనర్ బాకీ వీరబాబు, గూడూరు ఎంపిపి సంగా మధుసూదనరావు , గూడూరు జెడ్పిటీసి వేముల సురేష్ రంగబాబు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, స్థానిక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, యక్కల.నాగరాజు, ఊటుకూరి. రామకోటేశ్వరరావు గూడూరు తహసీల్దార్ బి విజయ ప్రసాద్, ఎంపీడీవో డి. సుబ్బారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img