విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను గురువారం టీడీపీ యువ నాయకులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మారెమ్మ దేవాలయంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీ పార్క్ లో బర్త్ డే కేకును కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు వెంకటేష్, ముత్యాల రెడ్డి, నారాయణ, ప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మనగా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు హెరిటేజ్ సంస్థను విజయపథంలో నడిపి వ్యాపార రంగంలో మహిళలకు ఆదర్శంగా నారా భువనేశ్వరి నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నాగన్న, ఈశ్వర్, టీడీపీ యూత్ నాయకులు నాగేంద్ర, మహేష్, రంగాస్వామి, మారేశ్, రాజు, రవి, జనసేనా నాయకులు వీరేష్, అనుమేష్ తదితరులు పాల్గొన్నారు.