సీసీ రోడ్లు నిర్మాణానికి నరవ భూమిపూజ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెద్దకడుబూరు మండలంలోని కంబళదిన్నె, జాలవాడి గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణానికి టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా కంబళదిన్నెలో మూడు చోట్ల రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే జాలవాడి గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో రెండు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేస్తే కూడమి ప్రభుత్వం గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో కూటమి ప్రభుత్వంతో గ్రామాలకు మహర్ధశ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనాథ్, ఎంపీడీఓ జయరాముడు, పంచాయతీ రాజ్ ఏఈ ఖాదర్ బాషా, ఏపీఎం శ్రీనివాసులు, ఏపీఓ ఖాదర్ బాషా, ఐసీడీఎస్ సూపర్ వైజర్ విజయకుమారి, టీడీపీ నాయకులు ఏసేపు, ముక్కన్న, విజయ్ కుమార్, ఈరప్ప నాయుడు, భీమ్ రాయుడు, యంకన్న, కంబగిరి, శ్రీనివాసులు, మునిస్వామి, తలారి అంజి, బొగ్గుల తిక్కన్న, బొగ్గుల నరసన్న, మునిస్వామి, తాయన్న తదితరులు పాల్గొన్నారు.