Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ప్రజా సంకల్పం కోసం పనిచేసే నాయకులనే గెలిపించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రజా సంకల్పం కోసం పనిచేసే నాయకులనే గెలిపించాలని ఇండియా కూటమి మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థి మురళీ కృష్ణ దొర, గోవర్ధన్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఇండియా కూటమి అభ్యర్థి మురళీ కృష్ణ దొర హస్తం గుర్తుకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం నిర్వహించారు . ఇండియా కూటమితోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొమ్మిది గ్యారెంటీ పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని వెల్లడించారు. మే 13న జరగే ఎన్నికల్లో ఇండియా కూటమి మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ కృష్ణ దొర కు, కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి రాంపుల్లయ్య హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు,లక్ష్మన్న, సిపిఐ నాయకులు జాఫర్ పటేల్, దస్తగిరి, హనుమంతు, గోపాల్, నాగేష్, సీపీఎం నాయకులు పరమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిక్కన్న, నాగరాజు, గిడ్డయ్య, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img