Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

వైభవంగా ధ్వజస్థంభ, విగ్రహ ప్రతిష్ట వేడుకలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శర్వాంభ దేవి ఆలయం వద్ద ధ్వజస్థంభ, నూతన విగ్రహాల ప్రతిష్ట మహోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగింది. అలాగే సద్గురు మాత శర్వాంభ దేవి ఆలయం మరియు శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయాల ఆవిష్కరణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణాలు మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ఆకు పూజ, బిల్వార్చన,కుంకుమార్చన, పంచామృతాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వస్థశ్రీ శోభాకృత నామ సంవత్సరం దృష్టమాసం, కృష్ణపక్ఱంన శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ కాశీ విశ్వనాథస్వామి, శ్రీ శర్వాంభ దేవి మరియు శ్రీ నందీశ్వరస్వామి విగ్రహాలు ప్రతిష్ట మరియు ఉదయం 11 గంటలకు ధ్వజస్థంభాగ్రహణ కార్యక్రమం అశేష భక్తివాహిణి నడుమ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు అంజినయ్య, లంకారెడ్డి, ఈరన్న, బాలరంగముని, శివరాం, మల్లేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img