Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని గ్రామ సర్పంచ్ రామాంజనేయులు అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక గ్రంథాలయం నందు గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయమని, గ్రంథాలయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయ మరమ్మతుల కోసం లక్ష రూపాయలు పంచాయతీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మరమ్మతుల సమయంలో స్త్రీ శక్తి భవనంను గ్రంథాలయం నడుపుకునేందుకు కేటాయిస్తామని తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img