విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పూజారి రవి (28)గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు, భార్య సంగీత, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉదయం రోజు మాదిరిగానే రవి గొర్రెలు మేపేందుకు వెళ్లాడు. గొర్రెలు కాస్తూ ఉన్నట్లు ఉండి కింద పడిపోయాడు. సహచర గొర్రెల కాపరులు రవిని చికిత్స నిమిత్తం పెద్దకడబూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తెచ్చారు. అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.