విశాలాంధ్ర – కర్నూలు సిటీ: గురుపౌర్ణమి సందర్భంగా యోగా గురువులను సన్మానించడం తమ అదృష్టమని టిజి భరత్ యోగా కేంద్రం గౌరవ అధ్యక్షులు సముద్రాల హనుమంతరావు అన్నారు.సోమవారం నగరంలోని కిడ్స్ వరల్డ్ టి జి భరత్ యోగా కేంద్రంలో యోగా సభ్యులు
గురువులు శ్రీవాణి,కళ్యాణ్,బలరాం దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సముద్రాల హనుమంతరావు మాట్లాడుతూ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు నయం కావడం, కరోనా టైంలో సభ్యులకు ఎవరికీ కూడా కరోనా రాకుండగా ఎవరికి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోగల్గినామంటే గురువులు యోగలో ఆసనాలు,ప్రాణాయామం ధ్యానము చేయించడం వల్లనే సాధ్యపడిందన్నారు. టీజీ భరత్ ఉచితంగా ఏర్పాటు చేసిన యోగకేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు మహిళలు,పురుషులకు యోగ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత యోగా కేంద్రం నిర్వహిస్తున్న టీజీ భరత్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, కార్యదర్శి బలరాం, కోశాధికారి మీరాబాయి, ఖాదర్ బాషా జయంతి,కొత్తకోట సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, మన్మధ రావు,
కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.