ఏఐవైఎఫ్ డిమాండ్
విశాలాంధ్ర- కర్నూలు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తామన్న రూ 3వేలు ఏలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కె. శ్రీనివాసులు, నగర కార్యదర్శి బిసన్నలు డిమాండ్ చేశారు.బుధవారం ఆ సంఘం నాయకులు చంటి అధ్యక్షతన కర్నూలు సిఆర్ భవన్ నందు ఏఐవైఎఫ్ నగర ముఖ్య నాయకులతో వారు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు, బిసన్న లు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల ఓట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసి కూడా, నిరుద్యోగ భృతి అమలుపై అనేక షరతులు పెట్టడాన్ని తప్పు పట్టారు. యువ నేస్తం పథకంలో నిరుద్యోగ భృతికి కుటుంబంలో ఒకరికి పింఛన్, కనీస ఆదాయం 10 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల సాగుభూమి, అదే పట్టణ ప్రాంతంలో అయితే 1500 చదరపు నివాస స్థలం మించి ఉండరాదని షరతులు విధించడం సరికాదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుద్యోగులను యువ నేస్తం పథకానికి అనర్హులుగా చేసేందుకే లేనిపోని షరతులు విధిస్తున్నారని వారు విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి కనీస వయోపరిమితి 45 సంవత్సరాలు ఉండగా ముఖ్యమంత్రి యువ నేస్తం నిరుద్యోగ భృతికి 35 ఏళ్ళుగా అర్హత నిర్ణయించడం సరికాదన్నారు.నిరుద్యోగ భృతి 45 ఏళ్ళ వరకు అర్హులుగా ప్రకటించాలని లేనిపక్షంలో ఏఐవైఎఫ్ గా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.నాయకులు సురేంద్ర, రాజశేఖర్ , కృష్ణ, హుస్సేన్ భాష, కాసిం శివ పాల్గొన్నారు.