విశాలాంధ్ర – ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) : అహోబిల లక్ష్మీనరసింహస్వామి పార్వేట వేడుకల్లో భాగంగా సోమవారం పల్లకిలో కొలువైన ఉత్సవ మూర్తులు సర్వాయిపల్లె గ్రామం నుంచి ఆళ్లగడ్డ చేరుకొని మొదటగా ఎం.వినగర్ లో ఉన్న మండల పరిషత్ కార్యాలయ తెలుపు వద్ద అధికారుల పూజలు అందుకున్నారు. తర్వాత ఆళ్లగడ్డ అగ్నిమాపక దళం అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం డిఎస్పి కార్యాలయం వద్దకు ఉత్సవ పల్లకి చేరుకోగానే రూరల్ సీఐ హనుమంత నాయక్, ఎస్ఐ నరసింహులు తోపాటు సబ్ డివిజన్ లోని పోలీసు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలు కాసేపు ఉత్సవ పల్లకినీ మోసారు.