ఈ నెల 7 నుంచి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహించనున్నారని కాంగ్రెస్ మీడియా సెల్ ఇన్చార్జ్ జైరాం రమేష్ పేర్కొన్నారు. 7న కన్యాకుమారి నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్టు వెల్లడిరచారు. యాత్రకు సంబంధించిన ప్రచార వీడియోను సైతం జైరాం రమేష్ విడుదల చేశారు. ప్రతిరోజు 22 లేదా 23 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సాగనుంది. 12 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగనుందని జైరాం రమేష్ వెల్లడిరచారు. జైరాం రమేష్ హిందీ పాటను విడుదల చేశారు. కన్యాకుమారిలో తమిళ పాటను, యాత్ర కేరళలో ప్రారంభం అయ్యే ముందు మలయాళీ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడిరచారు. మొత్తం పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, ప్రభుత్వం పేదల పట్ల మోపుతున్న భారాలను వారికి వివరించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.