Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు

మూడో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
జాబితాలో తొలి పేరుతోనే బీజేపీకి షాక్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మూడో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 43 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ.. మాజీ సీఎం సిద్ధరామయ్యకు ఓ రకంగా షాకిచ్చింది. వరుణతోపాటు కోలార్ నుంచి కూడా పోటీ చేయాలని సిద్ధూ భావించగా.. ఆయనకు కోలార్ టికెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. కోలార్‌లో తమ అభ్యర్థిగా కొత్తూరు మంజునాథ్ పేరును ప్రకటించింది. శుక్రవారమే బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావడికి అథానీ నియోజకవర్గ టికెట్ లభించింది. మూడో విడత జాబితాలో మొదటి పేరు లక్ష్మణ్‌దే కావడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయిందని.. అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ సతమతం అవుతోందని.. ఆ పార్టీ మూడో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదని బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇంఛార్జ్ అరుణ్ సింగ్ శుక్రవారం ఎద్దేవా చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోపే కాంగ్రెస్ పార్టీ మూడో విడత జాబితాను రిలీజ్ చేయడంతోపాటు.. బీజేపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన లక్ష్మణ్ సావడి పేరును ఈ లిస్టులో ముందు ఉంచడం గమనార్హం.

శిఖరీపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తుండగా.. ఆయనకు ప్రత్యర్థిగా జీబీ మలతేశ్‌ను కాంగ్రెస్ పోటీలో ఉంచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో శిఖరీపుర నుంచి యడియూరప్ప పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరఫున కురబ సామాజిక వర్గానికి చెందిన మలతేశ్ పోటీ చేశారు.

కర్ణాటక అసెంబ్లీలో 224 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 209 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 124 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. 69 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గానూ 60 మందికి టికెట్లు ఇచ్చింది. రెండో విడతలో 42 మందికి టికెట్లు ఇచ్చింది. లింగాయత్‌లు, వక్కలిగలకు ఆ పార్టీ ఎక్కువ సీట్లను కేటాయించింది. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కనకపుర నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే మరోసారి కలబుర్గి ప్రాంతంలోని చితాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలను వెల్లడిస్తారు.

మరోవైపు బీజేపీ సైతం రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి విడతలో 189 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ.. కొద్ది విరామంతో 23 మంది అభ్యర్థులతో రెండో విడత జాబితాను వెల్లడించింది. రెండు జాబితాల్లోనూ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ షట్టర్‌ పేరు కనిపించలేదు. దీంతో టికెట్ ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆయన పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. కాగా ఆయనకు సిద్ధరామయ్య కాంగ్రెస్‌లోకి ఆహ్వానం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img