వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకూ చక్కెర ఎగుమతులపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశవాళీ మార్కెట్లో చక్కెర అందుబాటులో ఉండేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఇంతకుముందు చక్కెర ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీతో ముగియనుండటంతో ఆ ఆంక్షలను కేంద్రం తాజాగా పొడిగించింది.న్యూఢల్లీి: చక్కెర ఎగుమతులపై ఆంక్షలను వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశవాళీ మార్కెట్లో చక్కెర అందుబాటులో ఉండేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. ఇంతకుముందు చక్కెర ఎగుమతులపై కేంద్రం విధించిన ఆంక్షలు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీతో ముగియనుండటంతో ఆ ఆంక్షలను కేంద్రం తాజాగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని, తక్కిన షరతుల్లో ఎలా%ఞ%టి మార్పు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ శనివారంనాడు ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, ఈయూ, యూఎస్లకు సీఎక్స్ఎల్, టీఆర్క్యూ డ్యూటీ కన్షెషన్ కోటాలపై మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని పేర్కొంది. చక్కెర అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో ఒకటైన భారతదేశం, ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ అతిపెద్ద ఎగుమతిదారుల్లో రెండో స్థానంలో ఉంది.