ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హిరాబెన్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను గుజరాత్ అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. కాగా, ఇటీవలే హీరాబెన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా మోదీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న ప్రధాని మోదీ సోదరుడి కారుకు యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే.