ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్ అతలాకతలం అవుతోంది. భారీ వర్షాల ప్రభావం రాష్ట్రంలోని నాలుగు జిల్లాలపై తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని శివపురి, ష్యోపూర్, గ్వాలియర్, దాతియా జిల్లాలలోని 1,171 గ్రామాలు వరదముంపునకు గురయ్యాయి. 200 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారుతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంత చేయాలని అధికారులను ఆదేశించారు.