న్యూదిల్లీ : ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు ఆసుపత్రి అధికారి ఒకరు శనివారం తెలిపారు. ఆయన డెంగీ సోకినట్లు నిర్ధారణ అయ్యిందని, అయితే పేట్లెట్ల సంఖ్య పెరిగిన కారణంగా ఆయన ఆరోగ్య స్థితి మెరుగుపడినట్లు వివరించారు. కాగా, సింగ్ ఆరోగ్యం నిన్నటి కన్నా మెరుగుపడిరదని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఏ ఆధారాలూ లేని ఊహాగానాలు అనవసరమని పేర్కొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రణవ్ రaా ట్వీట్ చేశారు. జ్వరం నేపథ్యంలో నీరసంగా ఉందని సింగ్ చెప్పిన తర్వాత బుధవారం సాయంత్రం ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్)లో ఆయన చేరారు. ఈ 89 ఏళ్ల మాజీ ప్రధాని ఆసుపత్రికి చెందిన కార్డియో`న్యూరో సెంటర్లోని ఒక ప్రైవేటు వార్డులో చేరారు. డాక్టర్ నితీష్ నాయక్ నేతృత్వంలోని గుండె వైద్య నిపుణుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గురువారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లి మన్మోహన్ సింగ్ను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా గురువారం సింగ్ను కలిసి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఇదిలాఉండగా, కేంద్ర మంత్రితోపాటు ఫొటోగ్రాఫర్ లోపలికి రావడంపై మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ విషయమై నా తల్లి చాలా బాధపడిరది. నా తల్లిదండ్రులు క్లిష్ట స్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఒక జూల్లో జంతువు కాదు’ అని దమన్ సింగ్ అన్నారు.