న్యూదిల్లీ : త్వరలో పంజాబ్లో జరగబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే వారి జాబితాలో తన పేరు లేకపోవడం ఎలాంటి ఆశ్చర్యానికి గురిచేయలేదని కాంగ్రెస్ నాయకులు మనీశ్ తివారీ ట్వీట్ చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రచార జాబితా విడుదల చేయగా, అందులో మనీశ్ తివారీని ఎంపిక చేయలేదు. జాబితాలో తన పేరు లేకపోవడానికి గల కారణాలు రాష్ట్ర రహస్యం కాదనీ, కొంతకాలంగా ఇది బహిరంగ వ్యవహారమేనని ఆయన అన్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ శుక్రవారం 30మందితో కూడిన ప్రచార జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ‘జీ23’ నాయకులుగా ఉన్న మనీశ్ తివారీ, గులామ్ నబీ ఆజాద్ సంస్థాగత నిర్మాణం కోరుతూ పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఇదే ‘జీ
23’లో ఉన్న మరికొందరు నాయకులు ఆనంద్ వర్మ, భూపిందర్ సింగ్ హూడాలు మాత్రం ప్రచారం జాబితాలో చేర్చబడ్డారు.