Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు..రామచంద్ర పిళ్లైను అదుపులోకి తీసుకున్న ఈడీ

ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్ట్‌
దిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో మరొకరు అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లైను మంగళవారం ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ అరెస్ట్‌తో దిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్‌ చేసినట్లయింది. వైద్య పరీక్షల అనంతరం రామచంద్ర పిళ్లైను కోర్టుకు ఈడీ తరలించనుంది. ఈడీ రిమాండ్‌లోకి తీసుకుని మరిన్ని విషయాలు ఆరా తీసే అవకాశముంది.దిల్లీ లిక్కర్‌ స్కాంపై సీబీఐ, ఈడీ ఇటీవల మరింత దూకుడు పెంచాయి. ఏకంగా దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం మనీష్‌ సిసోడియాను సీబీఐ రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆయనను తీహార్‌ జైల్లో ఉంచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో రామచంద్ర పిళ్లైని అరెస్ట్‌ చేయడంతో ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచినట్లు అర్థమవుతోంది. త్వరలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కూడా దిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్‌ చేయడం ఖాయమని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే ఒకసారి కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లో సీబీఐ ప్రశ్నించింది. ఆ తర్వాత 91 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కవిత విషయంలో కాస్త సీబీఐ దూకుడు తగ్గించింది. కానీ ఇటీవల సీబీఐ దాఖలు చేసిన పలు ఛార్జిషీట్లలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు కవిత పేరును కూడా సీబీఐ పేర్కొంది. సౌత్‌ గ్రూప్‌లో కవిత కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో కవితను కూడా అరెస్ట్‌ చేసే అవకాశముందనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా జరుగుతోంది. డిప్యూటీ సీఎంను అరెస్ట్‌ చేసిన సీబీఐకి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్‌ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img