తుపాకీ లైసెన్స్లను అక్రమంగా విక్రయించిన కేసులో జమ్మూ కశ్మీర్ ఐఏఎస్ అధికారి షహీద్ ఇక్బాల్ చౌధురితో పాటు మరికొందరి ఇళ్లపై సీబీఐ దాడులు జరుపుతోంది. షహీద్ ఇక్బాల్ ప్రస్తుతం గిరిజన వ్యవహారాల విభాగం అడ్మినిస్ట్రేటివ్ సెక్రెటరీ పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసులో షాహిద్ చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయనతో పాటు పలువురు అధికారుల ఇళ్లపై సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడి చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.