కోల్కతాలో ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొబైల్ గేమింగ్ అప్లికేషన్స్కు సంబంధించిన కేసులో కలకత్తాలోని ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ సోదాల్లో రూ.7 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ప్రివెన్షన్ ఆమ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2022 చట్టం నిబంధనల ప్రకారం…ఈ సోదాలు చేసినట్టు అధికారులు తెలిపారు. క్యాష్ కౌంటింగ్, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్క్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా…ఈ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆమిర్ ఖాన్ను గుర్తించారు. ఆమిర్ ఖాన్ ఓ యాప్ తయారు చేశాడు. ఈ యాప్ ద్వారా ఎంతో మందిని మోసం చేశాడని, ఈడీ తెలిపింది. ఇప్పటి వరకూ ఆయన ఇంట్లో రూ.7 కోట్ల నగదు దొరికినట్టు చెప్పింది. ఈ స్కామ్లో ఇంకెవరి హస్తం ఉందన్నది విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ యాప్ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు..? చైనా లోన్ యాప్స్తో దీనికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ జరపాలని ఆదేశించింది. లోన్ యాప్స్లో రుణాలు పొంది, వాళ్ల ఒత్తిడి తట్టుకోలే ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే…ప్రభుత్వం అప్రమత్తమైంది.