విశాలాంధ్ర -వరికుంటపాడు : మండలంలోని విరువూరు పంచాయతీ పరిధిలోని పాపన్న గారి పల్లె గ్రామంలో వ్యక్తిగత కక్షతో ఒకరిపై దాడి. వివరాల్లోకెళితే తెలనాకుల సత్యనారాయణ సన్నాఫ్ శ్రీరాములు అను వ్యక్తిపై గంగవరపు బాబు సన్నాఫ్ వెంకటస్వామి అను వ్యక్తి దాడి చేసి గాయపరచడం జరిగింది. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాల కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. తలకు బలమైన గాయం అయినట్లు బాధితుడు తెలిపాడు. ఈ విషయమై వరికుంటపాడు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేయగా పూర్తి వివరాలను సేకరిస్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ శ్రీనివాస్ తెలిపారు.