Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టిడ్కో లబ్ధిదారులందరికి త్వరిగతిన ఇళ్లు స్వాధీన పరచాలి

అరిగెల నాగేంద్ర సాయి, సి.పి.ఐ నగర కన్వీనర్

భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) నెల్లూరు నగర సమితి ఆధ్వర్యములో నగదుచెల్లించిన టిడ్కో లబ్ధిదారులందరికి వెంటనే ఇళ్లు స్వాధీనపరచాలని మంగళవారం నెల్లూరు నగర మున్సిపల్ కార్పోరేషన్ నందు లబ్ధిదారుల తో కలిపి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా సి.పి.ఐ నగర కన్వీనర్ అరిగెల నాగేంద్ర సాయి మాట్లాడుతూ , గత ప్రభుత్వములో టిడ్కో ఆధ్వర్యములో నిర్మిస్తున్న ఇండ్లలో డబుల్ బెడ్ రూము ఇళ్లకోసం లక్షరూపాయలు నదగు చెల్లించిన వందలమంది ప్రజలు నేడు నిరాశ్రయులుగా రోడ్లమీద పడిపోయారని , అప్పులు చేసి , వడ్డీలకు నగదు తీసుకుని వచ్చి , ఆకరికి మహిళల మంగళసూత్రాలు సైతం అమ్మి నగదు చెల్లించారు. ఐదు సంవత్సరములు గడచి , ప్రభుత్వం మారినా నగదు చెల్లించిన టిడ్కో లబ్ధిరాలను పట్టించుకోకపోవడం సిగ్గు చేటు, మరోపక్క బ్యాంకులనుండి లోన్లు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇళ్లు మాత్రం ఇవ్వలేదు కానీ బ్యాంకులకు లోన్లు చెల్లించాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. అనంతరం కమీషనర్ ను ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. కమీషనర్ కూడా సానుకూలంగా స్పందించి నగదు చెల్లించిన టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేస్తానని అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో సి.పి.ఐ సీనియర్ నాయకులు వి.రామరాజు , కె.ఆంజనేయులు , జిల్లా సమితి సభ్యులు వాటంబేటి నాగేంద్ర , ఆదినారాయణ ,నగర సి.పి.ఐ నాయకులు షేక్.ముక్తియార్, కె.స్టాలిన్ ,కె.సతీష్ , సుబ్బారాయులు ,ప్రత్యూష్ ,మహమ్మద్, విద్యాసాగర్ , తదితరలుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img