Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

భావోద్వేగాలతో భావదాస్యం

గతంలో లాగ మతం వేరు, దేశభక్తి వేరు కాదు. ప్రస్తుతం మన దేశంలో ఆ రెండూ కలిసిపోయి ప్రజల భావోద్రేకాలతో ఆడుకుంటున్నాయి. ప్రపంచంలో భారతదేశానికి అతి పెద్ద ప్రజాస్వామిక దేశంఅనే గుర్తింపు ఉంది. ప్రపంచంలోని ఓటర్లలో నాలుగోవంతు ఈ దేశంలోనే ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఆరోవంతు ఈ దేశంలోనే ఉన్నారు. అందువల్ల ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ మార్పుల ప్రభావం దక్షిణ ఆసియాలోనూ, ఇతర ప్రజాస్వామిక ప్రపంచదేశాల మీదా ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘దేశభక్తి’ కి సంబంధించిన సమస్యలు ప్రపంచంలో ఒక్క భారతదేశమే ఎదుర్కోవడంలేదు. ఇతర దేశాలలో కూడా మతపరమైన దేశభక్తి కొంత బలపడుతూ ఉంది. ఉదాహరణకు టర్కీ, లాటిన్‌ అమెరికా, పశ్చిమ ఐరోపా, సోవియట్‌లోని కొన్ని భాగాలు. 2018 నాటి కోస్టారికా అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినపడిరది. ‘‘మనల్ని దైవం పంపించిన ఒక మనిషి (మ్యాన్‌ ఆఫ్‌ గాడ్‌) పరిపాలించకపోతే ఇక వేరెవరూ పాలించలేరు’’అనేది ఒక మంత్రంగా పని చేసింది. ఆ మధ్య విజయవంతంగా గెలిచిన మితవాద బ్రెజిల్‌ అధ్యక్ష అభ్యర్థి జైర్‌ బొల్సనారో ప్రజల్లోకి ఒక సందేశాన్ని పంపించగలిగాడు. ‘‘పైన దేవుడున్నాడు గనకనే బ్రెజిల్‌ ముంగిట అన్నీ సమకూరాయి.’’ ఇలా క్రిస్టియన్‌ మతతత్త్వ దేశభక్తులు, ఇస్లాం మతతత్త్వ దేశభక్తులు ఎక్కువైపోతున్నారు. ఈ దైవభక్త దేశభక్తులు ఎక్కడైనా చేసేది ఒక్కటేముందు లేని దేవుణ్ణి చూపిస్తారు. తర్వాత సంస్కృతీ సంప్రదాయాలంటారు. గతమెంతో ఘనకీర్తి గల వాళ్లమన్నది గుర్తు చేస్తుంటారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి, మనుషుల్ని భావదాస్యంలోకి లాగేస్తారు. ఆ తర్వాత వారి పబ్బం వారు గడుపుకుంటారు. లాభమంతా అధికారం చేజిక్కించుకున్న వాడికే తప్ప, అధికారం అందించే వాడికి ఆకలి, దారిద్య్రం మినహా మిగిలేది ఏమీ ఉండదు.
భారతదేశంలోనూ జరుగుతున్నది ఇదే. గతంలో జరుగుతూ వచ్చింది కూడా ఇదే. బలవంతులు రాజులైతే వారికి సలహాదారుల స్థానంలో బ్రాహ్మణులుండేవారు. 1947 లో దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత, రాజ్యంగం రాసుకున్న తర్వాత, మెరుగైన సమాజానికి రూపకల్పన జరిగింది. సమాజంలోని మనుషులందరికీ సమానమైన హక్కులుబాధ్యతలూ వచ్చాయి. స్త్రీ, పురుషులకు సమానస్థాయి లభించింది. మత ప్రసక్తిలేని విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణే మా ధ్యేయం’ అని చెప్పుకున్న కాంగ్రెస్‌, స్వాతంత్య్రానంతరం చాలాకాలం దేశాన్ని పాలించింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ సమయంలో సిక్కుల ఊచకోత, గోల్డెన్‌ టెంపుల్‌ ఆపరేషన్‌లు జరిగాయి. ప్రతిఫలంగా ఆమె తన ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. రాజ్యంగా బద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ వస్తే, దేశంలో ఎన్నో దుర్ఘటనలు జరగకుండా ఉండేవి. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటూ రావాలేగాని, తప్పుల మీద తప్పులు, ఇంకా పెద్ద తప్పులు చేసుకుంటూపోతే, దేశంలో ప్రజాస్వామ్యానికి కాలం చెల్లిపోతుంది. బీజేపీ పూర్తి మెజార్టీతో అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజాస్వామ్య సంస్కృతిని ధ్వంసం చేస్తూ హిందుత్వ సంస్కృతిని ప్రాచుర్యంలోకి తేవడంతోదేశంలో మైనార్టీలకు భద్రత లేకుండా పోయింది. అంతేకాదు, అధికారంలో ఉన్నవారే అల్లర్లకు ఆజ్యం పోస్తున్నప్పుడు, మెజార్టీగా ఉన్న హిందువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. అల్లర్లు మొదలయ్యాయంటే, అవి ఎటు నుంచి ఏ మలుపు తీసుకుంటాయో తెలియదు. అల్లర్లలో చిక్కుకున్నవారు ఏ మతస్థులైనా కావొచ్చు కదా? కొన్ని నెలలుగా మణిపూర్‌ మండిపోతుంటే ఈ దేశ ప్రధాని ఒక చిన్నమాట మాట్లాడలేదు. ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ ఏమన్నారో చూడండి ‘‘టర్కీ భూ కంపానికి మన ప్రధాని స్పందించి ట్వీట్‌ చేస్తారు. గుజరాత్‌ తుఫాన్‌ గురించి ‘మన్‌ కి బాత్‌’ లో ప్రస్తావిస్తారు. కాని, మణిపూర్‌లో కొన్ని నెలలుగా జరుగుతున్న మారణకాండ గురించి ఎక్కడా ఏమీ స్పందించరు. అంటే ఈ దేశం ఏమి అర్థం చేసుకోవాలి? 1. ఆయనకు ఈ విషయం తెలియకపోవచ్చు. 2. విషయమంతా తెలిసినా, దాన్ని గుర్తించడానికి, వాటిపై స్పందించడానికి బహుశా ఆయనకు ఆసక్తి లేకపోవచ్చు’’ అని! మణిపూర్‌లో జరుగుతున్న క్రైస్తవ వ్యతిరేక హింసకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ మిజోరామ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆర్‌.వన్‌రామ్‌ ఛుఆంగా తన పదవితో పాటు బీజేపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇంఫాల్‌ను సందర్శించారు కానీ, రాష్ట్రంలో చర్చ్‌ భవనాలను తగులబెట్టడాన్ని ఆయన తప్పు పట్టలేదు. చర్చ్‌లను తగలబెడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఖండిరచకపోవడం భరించలేని బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయాడు. పార్టీ ముఖ్యం కాదు, మానవత్వానికి ప్రాధాన్యమివ్వడం ముఖ్యం!అని అనుకుని ఉంటారు వన్‌రామ్‌ ఛూఆంగా. అరవైఏళ్లుగా గత ప్రభుత్వం ఏం చేసింది? అని మోదీ, తరచూ తన ప్రసంగాల్లో ప్రశ్నిస్తుంటారు. గత ప్రభుత్వాలు అరవైయేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ వస్తున్నాయని చెప్పడానికి మోదీజీయే ఒక పెద్ద ఉదాహరణ! ఒక రుజువు!! చదువుకోకపోయినా, రైల్వే స్టేషన్లో చాయ్‌ అమ్ముకుని బతికినా, భిన్నమైన ఆలోచనాధోరణి గలవాడైనా... ఈ దేశ ప్రజలు అతణ్ణి ప్రధానిని చేశారు కదా? ప్రజాస్వామ్యమంటే అదే గత పాలకులు నిరంకుశులైతే మోదీ ప్రధాని అయ్యేవాడేకాదు. ముందు ఆ విషయం గ్రహించుకుంటే బావుండేది. అయినా ఆ స్థానానికి ఉన్న విలువను కాపాడలేక, ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు కావడం ఆయన తప్పిదం, ఆయన పార్టీ తప్పిదం! వెనక ఉండి నడిపిస్తున్న ఆరెస్సెస్‌ తప్పిదం!!! అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా తామేం చేస్తున్నామని ఆత్మావలోకనం చేసుకోవడం మంచిది. ఏ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలేదూ? అన్నది ప్రజలు బేరీజు వేసుకుంటారు. అది వారి పని నాయకులు వారి బాధ్యతల్ని వారు నిర్వహించుకుంటూ ఉంటే, ఇతరులను ప్రశ్నించొచ్చు. పార్లమెంట్‌ సమావేశాలు (జులై 2023) ఎగ్గొట్టి కేంద్ర సహాయమంత్రి వచ్చి హైదరాబాదులో రోడ్డు మీద బైఠాయిస్తాడు. తను వెంటనే సింగారం డబుల్‌ బెడ్‌రూంలు చూడాలంటాడు. పార్లమెంట్‌ సమావేశాలు ఎగ్గొట్టి రావడం గొప్ప బాధ్యత గల పనా? ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలో కనీస పరిజ్ఞానం కేంద్ర మంత్రులకే లేకపోతే ఎలా? కుకీ మహిళల్ని నగ్నంగా ఊరేగించిన అమానుష సంఘటన 2023, మే 4 న జరిగితే, జులై 20 న 78 రోజుల తర్వాత ఒకరిని అరెస్టు చేశారు. దేశ పరిపాలనా వ్యవస్థ పనితీరును ఇది ప్రతిఫలిస్తుంది. నిజానికి సీన్‌లో కనిపించేవారు దోషులే అయినా, వారిని ఉసిగొల్పిన పెద్ద దోషులు వేరే ఉన్నారు. నోర్లు విప్పకుండా, నిర్లిప్తంగా, ఘోరాలు జరగడానికి సహకరించిన రాష్ట్రకేంద్ర నాయకులే అసలు దోషులు! స్వతంత్ర భారతదేశంలో తొలిసారి జరిగిన ఈ సంఘటన కేంద్ర, రాష్ట్ర నాయకత్వాన్ని అంటే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ని ప్రశ్నించింది. వారి మెదళ్లలోని అనాగరికతకు అద్దం పట్టింది. మణిపూర్‌ జనాభాలో 54 శాతానికి పైగా ఉన్న మైతీ కులస్థులకు కుకీ, నాగ, గిరిజన తెగలకూ మధ్య బీజేపీ తన రాజకీయ లబ్దికోసం చిచ్చుపెట్టింది. గిరిజన చట్టాలను అతిక్రమించి మైతీలను గిరిజనులుగా మార్చడానికి బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. కుకీ, నాగ తెగలు ప్రతిఘటించాయి. ఈ గిరిజన తెగలవారు క్రిస్టియన్లు. అందువల్ల మతోన్మాదులు ప్రభుత్వాల అండతో వారి ఇండ్లు, చర్చ్‌లు ధ్వంసం చేశారు. వందల మందిని చంపేశారు. స్త్రీలపై అత్యాచారాలు చేశారు. రెండున్నర నెలలుగా అక్కడ మారణహోమం జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అందరికందరూ మౌనం వహించారు. అదుపు చేయడానికి ప్రయత్నించలేదు. అంతా అయిపొయ్యాక దేశ ప్రధాని విభ్రాంతి వ్యక్తం చేశారు. తన, తన ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చి, ఒక రాజకీయ ప్రకటన చేశారు. దాన్ని మించిన అవివేకపు ప్రకటన మరొకటి ఉండదని దేశ ప్రజలు ఉడికిపోయారు. నిజాయితీగల మనుషులైతే నాయకులంతా రాజీనామాలిచ్చి, రాష్ట్రపతి పాలన తేవాలి. దానితో పరిస్థితి అదుపులోకి రావొచ్చు. మోదీజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌ గాయమైంది. ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్‌ మండిపోయింది. ఎన్ని తప్పులు క్షమించినా, దేశ ప్రజలు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ రెండు తప్పుల్ని ఎప్పటికీ క్షమించరు.
` సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img