Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

మూఢ నమ్మకాలపై కందుకూరి పోరాటం

డాక్టర్‌ దేవరాజు మహారాజు

‘‘కార్యశూరుడు వీరేశలింగం
కదం తొక్కి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను
తుద ముట్టించిన అగ్ని తరంగం’’

తెలుగు రచయిత, సంఘసంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగవ పంతులు గూర్చి తెలుగు కవి శ్రీశ్రీ వాక్కులివి!
ఇది కందుకూరి వారి 176 వ జయంతి, 105 వ వర్థంతి (16 ఏప్రిల్‌ 184827 మే 1919).‘ఉద్యోగంలో చేరడానికి అమావాస్య నాడే ఎందుకు వచ్చావని’ అధికారి అడిగాడు ‘‘అయ్యా! అన్ని రోజులూ ఆ ఈశ్వరుడు సృష్టించినవనే చెపుతారు కదా? మరి అలాంటపుడు అన్ని రోజులూ మంచివేఅలాంటప్పుడు ఇక నేను ఏ రోజు ఉద్యోగంలో చేరినా, అది మంచిరోజే అవుతుంది!’’ అని తాపీగా సమాధానమిచ్చారు వీరేశలింగం. ఈ విషయం ‘‘మూఢ నమ్మకాలపై నా పోరాటం’’ అనే గ్రంథంలో ఆయనే స్వయంగా రాసుకున్నారు (పే24). అభిరుచి ఉన్నవారు ఆ పుస్తకం సంపాదించి, క్షుణ్ణంగా చదవడం మంచిది. అందులో ఆయన అనేక ప్రహసనాలు రాశారు. అందులో ఒకటి ‘‘శకునాలు’’ అనే శీర్షికతో ఉంది. ఉదాహరణకు ఇక్కడ అందులోని విషయాలు కొన్ని క్లుప్తంగా పొందుపరుస్తున్నాను. సున్నిత హాజ్యం, వ్యంగ్యం మేళవించి ఎంతో మనోరంజకంగా రాశారు గమనించండి! కుటుంబాన్ని తీసుకుని ప్రయాణం చేయాలంటే వెనకటి రోజుల్లో ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేది. అసలే రవాణా సౌకర్యాలు సరిగా లేని రోజులు. పైగా ఘడియ ఘడియకూ ముహూర్తాలు చూసుకునే పిచ్చి. మనువాదులు ఆ పిచ్చిని ఎప్పటికప్పుడు మరింతగా పెంచి పోషిస్తూ ఉండేవారు. ఆ విశేషాలన్నీ వీరేశలింగం సోదాహరణంగా రాసుకొచ్చారు. ఇన్నిన్ని చాదస్తాల మధ్య ఆ కాలం మనుషులు ఎలా బతికారబ్బా?అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది కూడా! ఆడవాళ్లను తీసుకుని మంచి చెడ్డా విచారించకుండా దురాభారం ఎలా బయలేదేరేనండీ? పోనీ, అమావాస్యకు ముందే బయలుదేరుదామంటే, దోవలో అమావాస్య వస్తే మంచిది కాదని పెద్దలు చెప్పారు. అమావాస్య వెళ్లిన పాడ్యమి ప్రయాణానికి బొత్తిగా మంచిది కాదు. విదియనాడు బయలుదేరుదామంటే ఆ రోజు శుక్రవారం అయ్యింది. అక్కడికీ మొండిగా చొరవచేసి బయలుదేరుదామని అనుకునేంతలో ఎవరో ‘హాచ్చ్‌’ మని తుమ్మినారు. అటువంటి అపశకునం అయిన తర్వాత, ప్రయాణం ఎలా చేస్తామని ఆనాటికి మానేశాం. శనివారం ఉదయమా దుర్ముహూర్తం! పిల్లలను తీసుకుని ఎలా బయలుదేరడం? ఆ మధ్యాహ్నమేమో వర్జ్యం వచ్చింది! వర్జ్యం వెళ్లిన తరువాతి రాత్రి, బండి కోసం కబురు చేయబోతుంటేగుడ్లగూబ కూసింది. అలాంటప్పుడు ప్రయాణం మానేయక తప్పదు కదా? ఇక ఏం చేయడం? ఆ మరునాడు చవితి. ప్రయాణానికి చవితి ఏ మాత్రం మంచిది కాదని అందరికీ తెలిసిన విషయమే కదా? తరువాతి రోజు పంచమి బయలుదేరాలి. కానీ, ఉదయాన నక్షత్రం మంచిది కాదు. అదీ కాకుండా వర్జ్యం కూడా వచ్చింది. మధ్యాహ్నం బయలుదురుదామని భోజనం చేసి పచార్లు చేస్తూ ఉంటే, మాలబల్లి మీద పడిరది. జ్యోతిష్యుణ్ణి పిలిపించి స్నానం చేసి, దీపం పెట్టుకుని శాంతీగీంతీ చేసుకునేప్పటికి దీపాల వేళయ్యింది. రాత్రి భోజనాలు చేసి యలుదేరుదామంటే పెద్దలందరు చుక్క ఎదురు వెళ్లగూడదన్నారు. సరేఆ మరుసటి రోజు షష్టి. ఒక్క షష్టి మాత్రమే అయితే ఎలాగయినా బయలుదేరుదును. కానీ, ఆరోజు పిడుగువలె మంగళవారం కూడా వచ్చింది. ఈ రెంటికీ తోడు ఆరోజు ఒట్టి పాడు నక్షత్రం ఇక సప్తమీ బుధవారం ప్రయాణానికి బహు అనుకూలమైంది. కానీ, ఆరోజు మా చిన్న కుర్రవాడి పుట్టిన దినం. ఆ పండుగ ముగించుకుని భోజనాలు చేస్తేగాని బయలుదేరేదే లేదని ఇంట్లో ఆడవాళ్లు పట్టుబట్టారు. అసలు ఆ ఉదయాన్నే బయలుదేరితే మధ్యాహ్నానానికి దొంగల మర్రి దాటిపోయే వాళ్లం. దొంగల మర్రి అంటే దారి దోపిడీ దొంగలు పొంచి ఉండే చోటు. కానీ, భోజనాలు కాగానే బయలుదేరుదామని బండి కట్టించి, తీరా ఎక్కబోయే సరికి వెధవముండ ఎదురుగా వచ్చింది. మళ్లీ లోపలికి వెళ్లి అర్ధగంట సేపు ఆగాము. అప్పుడు బయలుదేరినా దీపాలు పెట్టక ముందే దొంగల మర్రి దాటేసేవాళ్లం. కానీ, వీధి గుమ్మంలోకి వచ్చేసరికి ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చాడు. అందుకని లోపలికి వెళ్లి కొంతసేపు ఆగాము. ఇలా అయితే లాభం లేదని వీధిలో ఎవరూ నడవకుండా జాగ్రత్తపడి పొరుగింట్లో నుంచి ఒక ముత్తయిదువును ఎదురురమ్మని చటుక్కున బండి ఎక్కి బయలుదేరాము. ఎంత మంచి శకునం చూసి బయలుదేరినా, ఆ వెధవ ముండ ఎదురుగా వచ్చిన వేళ ఎటువంటిదో కానీ ఫలితం మాకు వెంటనే కనిపించింది. రాత్రి పది గంటలకు మేము జడుస్తూనే దొంగల మర్రి దగ్గరకు చేరాము. దొంగలు వచ్చి నగలన్నీ ఎత్తుకుపోయారు. మేం మంచి శకునం చూసుకుని బయలుదేరడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాం. మొన్న ఓసారి జాతకం చూపించుకుంటేనాకు ధన నష్టం ఉందని జ్యోతిష్యుడు చెప్పాడు. అంటే అంతా నిజమైనట్టే కదా? జ్యోతిష్యం తప్పలేదుజ్యోతిష్యాన్ని నమ్మేవారు తాము నమ్మిన జోస్యాలు నిజం కానప్పుడు వాటిని పట్టించుకోకుండా పక్కన పెడతారు. ఎప్పుడైనా ఒకటీ, అరా నిజమైతే వాటినే మళ్లీ పట్టుకుని వేళ్లాడుతారు. ఒక విధంగా జ్యోతిష్యం చెడిపోయిన గడియారం లాంటిది. ఆగిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది. అలాగని, ఆగిపోయిన గడియారాన్ని నమ్మడం ఎంత మూర్ఖత్వమో, జ్యోతిష్యాన్ని నమ్మడం కూడా అంతే మూర్ఖత్వం! వాస్తవానికి మనం ఏదైనా విషయం ఊహించి చెపితే, అందులో కొంత వరకు నిజమయ్యే అవకాశాలు ఉంటే ఉంటాయి. ఉండకపోతే ఉండవు. ఇకపోతే, దేవుడి విషయం చూద్దాం! ఒక కారుకు బ్రేకులు ఫెయిలయ్యి లోయలో పడిరదని అనుకుందాం. ఆ ప్రమాదంలో బతికిన వాళ్లు ‘ఆ దేవుడి దయ వల్ల బతికామని’ చెప్పుకుంటారు కదా? మరి చనిపోయిన వారిని ఎవరు చంపినట్టూ? ఆ దేవుడే చంపాడని చెప్పాలి కదా? కానీ, చెప్పరు. ఒకవేళ ప్రమాదానికి గురైన ఆ కారులోని వారంతా చనిపోతే మీడియాలో వార్త ఇలా ఉంటుంది. ‘‘కారు బ్రేకులు ఫెయిల్‌: ఐదుగురు ప్రయాణికు మృతి’’అనే కదా ఉంటుందీ? బ్రేకు ప్రసక్తి ఉండదు. ప్రయాణికులు బతికితే ‘దేవుడి దయ’ వల్ల బతికారనడం, మరణిస్తే తప్పు బ్రేకులు ఫెయిల్‌ కావడంపై పెట్టడం ఏమైనా బాగుందా? తప్పు దేవుడి మీద పెట్టి ఆయనే చంపేశాడని అనుకునే ధైర్యం ఉండదు. ప్రజలు ఇలాంటి ధోరణికి అలవాటు పడిపోవడం వల్ల కదా దేవుడు, జ్యోతిష్యం, వాస్తు, ఆత్మ, పునర్జన్మ వంటి అంధ విశ్వాసాలు సమాజంలో సజావుగా బతుకుతున్నాయి. ఇలాంటి విశ్వాసాల వల్లనే సమాజం రోగగ్రస్తమవుతూ ఉందీ? మన చుట్టూ జరుగుతున్న విషయాల్ని నిశితంగా పరిశీలిస్తూ, హేతుబద్ధంగా విశ్లేషించుకుంటే నిజానిజాలు బయటపడతాయి! దైవాన్నీ, జ్యోతిష్యాన్ని ప్రబోధించేవారు తమ సౌకర్యాను సారంగా ఆలోచనల్ని విధి విధానాలని మార్చుకుంటూ ఉంటారని వీరేశలింగం పంతులు ఏనాడో చెప్పారు. మరి మనవాళ్లు ఏమైనా చెవికి ఎక్కించుకున్నారా? లేదేగుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డిగా అంధ విశ్వాసాల్లో పడిపోతున్నారు.ఒక పెరియార్‌, ఒక కందుకూరి, ఒక తాపీ ధర్మారావు, ఒక గోరా, వివేచన అనే దుడ్డుకర్రతో జనాన్ని అదిలిస్తూనే వచ్చారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం కూడా ఆ పనిని కొనసాగిస్తూనే ఉండాలి? జన చైతన్యానికి దోహదం చేస్తూనే ఉండాలి!! ఇక ప్రస్తుత దేశ రాజకీయ పరిప్థితుల్లోకి వద్దాం. ‘‘మహా భారత కాలంలోనే సాటిలైట్‌ ఇంటర్నెట్‌ ఉంది.’’ అని అన్నాడు త్రిపుర ముఖ్యమంత్రి. నిజమే ఆయన ఊహ ప్రకారం ఆరోజుల్లో (అంటే ఆ కావ్యం రాసిన కాలంలో) చాలాచాలా జరిగేవేమోబహుశా ఆ ఊహలు ఇలా ఎందుకు ఉండకూడదూ? యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు భయానక యుద్ధ చిత్రాల్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ అప్‌డేట్స్‌ ఇస్తూ ఉండొచ్చు. అర్జునుడు వాటిని ఇన్‌స్టాగ్రాంలో తన సైనిక బలగాలకు సూచనలిస్తూ ఉండొచ్చు. దృతరాష్ట్రుడు యుద్ధ విశేషాల్ని ఎఫ్‌.ఎం.రేడియోలో వింటూ ఉండొచ్చు. పాండవులు తమ ‘ఐఫోన్‌’ తో సెల్ఫీలు దిగుతూ ఉండొచ్చ. మొత్తం యుద్దాన్ని ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసారం చేస్తూ ఉండొచ్చు ఇలా అని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ భక్తుల్ని మనం ఎద్దేవా చేయడం కాదుగానీవాళ్లేమిటో వారే నిరూపించుకుంటున్నారు. మత ద్వేషం, ఆవుపేడ, ఆవు మూత్రం వంటి వాటితో ఈ దేశ ప్రజల్ని విడగొట్టి, విభజించి దేశాన్ని హిందూరాష్ట్ర్‌గా మార్చాలన్న ఉద్దేశంతోనే విద్యారంగాన్ని కూడా కాషాయంలో ముంచుతున్నారు. దేశాన్ని మొత్తానికి మొత్తంగా మూఢ నమ్మకాల్లోకి దించుతున్నారు. ‘‘దేశం కాషాయీకరణ చెందితే తప్పేంటి?’’ అని ఈ దేశ మాజీ ద్వితీయ పౌరుడు, తెలుగువాడు వెంకయ్యనాయుడు ప్రశ్నిస్తుంటేమనం 21 వ శతాబ్దంలో ఉన్నామా? లేదా సాధారణ శకానికి ముందున్న కాలంలో ఉన్నామా? అని అనుమానపడాల్సి వస్తోంది. ఇప్పుడు బాధ్యత ప్రతిపక్షాల మీద మాత్రమే కాదు, ప్రశ్నించగల సామర్థ్యం, స్థైర్యం గల సామాన్య పౌరుల మీద కూడా ఉంది. సామాన్య పౌరులు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం హేతువాదుల వైజ్ఞానికుల, మానవవాదుల రచనలు చదువుతూ స్ఫూర్తిని పొందుతూ, మును ముందుకు దూసుకుపోవాల్సి ఉంది!
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత,
విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img