Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రజాకోర్టులో నిలబడాల్సిన ప్రభుత్వం

డాక్టర్‌ దేవరాజు మహారాజు

మాజీ ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్‌ సాదత్‌ను ఎందుకు చంపావని అడిగాడు జడ్జి హంతకుణ్ణి.
అతను సెక్యులర్‌అని అన్నాడు హంతకుడు సెక్యులర్‌ అంటే ఏమిటీ అడిగాడు జడ్జి
ఏమో! నాకు తెలియదుఅన్నాడు హంతకుడు. మన భారతదేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ సమాధానం కూడా ఇలాగే ఉంటుంది. వారికి సెక్యులర్‌ అంటే అర్థంకాదు. కానీ, ఎవరైనా ఆ మాట ఉచ్ఛరిస్తే చాలు వారిపైకి ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ వంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఉసిగొల్పుతుంది. దేశవ్యాప్తంగా లెక్కలేనంత మందిపై ఎంక్వయిరీలు వేశారు...కదా? వేస్తున్నారు..కదాÑ కొండను తవ్వి ఎలకను కూడా పట్టలేదే? ప్రజాసంక్షేమ ప్రభుత్వం కావాలనుకుంటే, ఇదేమిటీ? ప్రజాసంక్షోభ ప్రభుత్వం దాపురించిందీ అనిప్రజలు వాపోతున్నారు. ఈజిప్టు రచయిత నగిబ్‌ మహపౌజ్‌ను కత్తితో పొడిచి చంపిన కేసులో జడ్జి హంతకుణ్ణి అడిగాడు. నగిబ్‌ మహపౌజ్‌ను కత్తితో పొడిచి, ఎందుకు చంపావ్‌? అతను ‘ద చిల్డ్రన్‌ ఆఫ్‌ అవర్‌ నైబర్‌ హుడ్‌’ అని రాసాడు కాబట్టి చంపాను. ఓ నువ్వా నవల చదివావా? జడ్జి అడిగాడు. లేదుఅన్నాడు హంతకుడు.ఇదికూడా అధికారంలో ఉన్న భారత ప్రభుత్వానికి సరిపోతుంది. ఆరో తరగతి కూడా చదవని ఆర్‌ఎస్‌ఎస్‌ మేథావి ప్రభుత్వాధినేత అయితే, రచయితల్ని, జర్నలిస్టులని, సనాతన ధర్మసంస్థ ద్వారా చంపించడం ఒక్కటే మార్గం అని అనుకుంటాడు. గౌరీ లంకేశ్‌, కల్బుర్గీ, పన్సారే, డా.దబోల్కర్‌లే కాదు...వరవరరావు, ప్రొ.సాయిబాబా వగైరా వగైరా ఎంతమంది పేర్లయినా చెప్పుకోవచ్చు. వీరు ప్రభుత్వాన్ని పడగొట్టే పనులు చేశారా? జన చైతన్యానికి రచనలు చేసేవారిని ప్రధాని హత్యకు పథకాలు రచించారని జైల్లో వేస్తారా? లేదా చంపిస్తారా? గుజరాత్‌, మణిపూర్‌ మారణకాండలు జరిపించడం మీకింకా చాలలేదా? ఏమైతేనేం చరిత్రలో నిలిచిపోయే పనులే చేశారు సామీ! ఖాళీ మెదళ్లే లొడలొడమని ఎక్కువ శబ్దం చేస్తాయి మిత్రోఁఈజిప్టు రచయిత ఫరాజ్‌ఫరాను చంపిన మరో హంతకుణ్ణి జడి ్జఇలా ప్రశ్నించారు.
ఫరాజ్‌ను ఎందుకు హత్య చేశావ్‌?
ఎందుకంటే, అతను నమ్మకద్రోహిఅన్నాడు హంతకుడు అతను నమ్మకద్రోహి అని నీకు ఎలా తెలుసూ? జడ్జి అతను రాసిన పుస్తకాల వల్ల! హంతకుడన్నాడు. అయితే, అతను రాసిన పుస్తకాలు ఏవేవీ చదివావూజడ్జి
నేనేదీ చదవలేదుఅన్నాడు హంతకుడు ఏం? ఎందుకు? జడ్జి అడిగాడు. ఎందుకంటే, నాకు చడవడం, రాయడం రాదు! రచయిత అరుంధతీరాయ్‌ని కూడా ఈ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. పుస్తకాలు చదివే అలవాటే ఉంటే, ఈ దేశ పాలకులు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవరిస్తారూ? దేశ నాయకుడే కాదు, ఆయన అనుచరగణంలోని ఎవరైనా సరే, అరుంధతీ రాయ్‌ రచనలో ఒక పేజీ చదివి అర్థం చెప్పగలిగితే ఈ దేశ ప్రజలు తమ చెప్పులతో తామే కొట్టుకుంటారు. చెప్పలేకపోతే దేశ ప్రజల చెప్పు దెబ్బలు ఎవరికి తగలాలీ? జ్ఞానం వల్ల విద్వేషం ఎప్పుడూ ప్రచారం కాదు. అది అజ్ఞానం వల్ల, మూర్ఖత్వం వల్లనే ప్రచారమవుతుంది. పైన హంతకులు చెప్పిన సమాధానాల వల్ల మనకు ఈ విషయం రూఢగాి తెలుస్తూ ఉంది. తెల్లజుట్టూ, తెల్లగడ్డం ఉన్నవాళ్లను చూసి వాళ్లేదో పెద్దలని అనవసరంగా, అర్హతలేని గౌరవం ఇవ్వగూడదని ధమ్మపథం చెప్పింది. ‘‘తల నెరిసినంత మాత్రాన ఎవరూ పెద్దలు కారు. వారు జీవితాన్ని వ్యర్థంగా గడిపేసిన వృద్ధులు మాత్రమే! సత్య ధర్మాలూ, అహింస, అత్మనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఎవరిలో నెలవై ఉంటాయో, మాలిన్యాలను విసర్జించి నిర్మలుడై నిలిచిన వాడే పెద్ద’’ధమ్మపథం(కలాను సుత్తఅంగుత్తర నికాయలో (వాల్యూమ్‌ 188193)మీరు విన్నవన్నీ నమ్మకండి అని కూడా అన్నాడు బుద్ధుడు. సనాతనధర్మం పేరు చెప్పి డబ్బులు దండుకుంటున్న ‘శివశక్తి’ ముఠా ఈ మధ్య బైటపడిరది. ‘‘సనాతన ధర్మ సంస్థాపనార్ధాయ! పాశాండ మత నిర్మూలనార్ధాయ’’ అంటూ 2029 సెప్టెంబరులో వార్షికనిధి పేరుతో కొందరు జనం వెంటపడ్డారు. శివాజీ బొమ్మ చూపి ఓ దొంగబాబా మహారాష్ట్రలో విరాళాలు సేకరించాడు. అందుకే ప్రతిదాన్ని పరీక్షించడం, నిజాల నిగ్గుతేల్చుకోవడం ప్రజలు అలవర్చుకోవాలి. ఎవరి మాటలకో ప్రభావితులై డబ్బులు వదిలించుకోవడంగానీ, ఓట్లేయడం గానీ, అమ్ముడు పోవడం గానీ చేయగూడదు. దేవీ నవరాత్రుల సమయంలో ఒకాయన దేవీస్తోత్రం రాసి, చిన్న పుస్తకం ప్రచురించాడట. దాని ధర ఇరవై రూపాయలట. కానీ, ఐదు వందల రూపాయలు ఫోన్‌ పే మీద విరాళం పంపితే ఆ దేవీ ఆశీర్వాదంతో, కవిగారి అభినందనలతో పుస్తకం పంపిస్తారట! వెంటనే డబ్బులు పంపాలని శుభాకాంక్షలతో అందరికీ మెసేజెస్‌ పంపి, డాబుగా బిచ్చమెత్తాడు. మనుషుల్ని మోసం చేయడానికి, బోల్తా కొట్టించడానికి కొత్తకొత్త పద్ధతులు కనిపెడు తున్నారు. వినాయకుడు పేరుతో విరాళాలు, శివశక్తి పేరుతో విరాళాలు, దేవీ నవరాత్రుల పేరుతో విరాళాలు. సిగ్గూ, శరమూ, అత్మాభిమానం, వదిలేస్తే డబ్బులు సంపాదించుకోవడానికి మార్గాలు సులభమౌతాయి. బతికినంతకాలం ధన్‌ ధన్‌ (హిందీలో ధనం) అని ఎంతగా అంగలార్చినా, కన్ను మూయగానే ‘నిధన్‌’ (మరణించారు) అనే ప్రకటిస్తారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసిందీ? కూలినాలి చేసుకున ేవారితో కూడా బ్యాంక్‌ ఎకౌంట్‌లు తెరిపించింది. వారికి జరిగిన మేలేమిటి? ఆ డబ్బంతా తీసుకుపోయి కార్పొరేట్లకు మేలు చేశారే తప్ప, సామాన్యులకు ఒనగూరిన మేలేమీ లేదు. కార్పొరేట్లకు పెద్దమొత్తంలో అప్పులు రద్దు చేశారు తప్పిస్తే, పేదలకు, మధ్యతరగతి వారి అప్పులేమైనా రద్దుచేశారా? హిందువులు, హిందువులనీ ఈ దేశం హిందువులదనీ ఈ ప్రభుత్వం డప్పుకొట్టుకుంటోంది కదా? అసలు ఈ దేశంలో హిందువులకు జరిగిన మేలేమిటో ఆలోచించి ఒక్కటి గుర్తుచేసుకోండి చూద్ధాం! హిందువులంతా బంధువులే కదా? ఇల్లు అద్దెకు కావాలని ఎవరైనా వెళ్లి అడిగితే వారి కులం, గోత్రం, పూర్వా పరాలు అడిగిఅడిగి హింసిస్తారెందుకూ? ఈ ప్రధాని నోట్లు రద్దుచేసినప్పుడు బ్యాంకుల ముందు క్యూలల్లో హిందువులు చావకుండా ఉన్నారా? విదేశాల నుండి నల్లడబ్బు తెప్పించి దేశంలోని ప్రతి పౌరుడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానన్నఈ దేశ ప్రధాని, కనీసం హిందువుల ఖాతాల్లోన్నయినా వేయాలి కదా? ఏవీ మరీ? ఎవరికీ ఏ ఉపయోగం జరగనప్పుడు హిందూ అనే పదం మాటిమాటికీ వల్లెవేయడం ఎందుకూ? ఒకప్పుడు పారసీ డిక్షనరీలలో వాళ్లు రాసుకున్నదాన్నే నేటి పాలకులు నిజంచేసి చూపుతున్నట్లుగా ఉంది! హిందూ మతం మీద మా వివేకానందుడు అమెరికాలో గొప్పగా ఉపన్యసించి వచ్చాడని చెప్పుకుంటారుకదా? మరి ఆయనే ఆనాటి దేశపరిస్థితిని చూసి ఏమన్నాడో చూడండి‘‘ అస్పృశ్యులనబడే ప్రజలను ఈనాటి అధ్వాన్నస్థితికి దిగజార్చిన వారెవరూ? ఎవరు దీనికి బాధ్యులు? దీనికి ఆంగ్లేయులు మాత్రం బాధ్యులు కారు. అనేక పారమార్థిక, వ్యవహారిక సిద్ధాంతాలను కనిపెట్టిన హిందూమతంలోని కుటిలులే ఇందుకు కారకులు’’ అన్న స్వామి వివేకానంద ‘దేశాన్ని పునర్నిర్మించండి’ అని పిలపునిచ్చాడు (స్వామి వివేకానంద పేజి:16 రామకృష్ణ మఠం ప్రచురణ) అంతేకాదు సైన్స్‌లాగా మతాలు కూడా మారుతూ ఉండాలని కూడా చెప్పాడు. ఈ దొంగ రాజకీయ మతపెద్దలు ఇలాంటి విషయాలు బైటకు రానీయరు. చదువులేని అజ్ఞానులు కొంతమంది, చదువుకున్న మూర్ఖులు మరికొంతమంది కలిసి నడుపుతున్న ఈ ప్రభుత్వంలోని ‘పెద్దలు’ 1916లో బనారస్‌లోని సెంట్రల్‌ హిందూ కాలేజి, బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ కలిసి ప్రచురించిన ‘యాన్‌ ఎలిమెంటరీ టెక్స్ట్‌: హిందు రెలీజియన్‌ అండ్‌ ఎథీక్స్‌’ తప్పకుండా చదవాలి. సనాతన ధర్మం గురించి మాట్లాడే సంప్రదాయ వాదులు ఆ గ్రంధం చదివాకే నోరు విప్పాలి! అప్పుడు వారు రాసిపెట్టిన దానికీ, ఇప్పుడు వీరు మాట్లాడుతున్న దానికీ వ్యత్యాసం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి! ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకో మంటున్నాం అంతే. ఇంకా వేరేసాక్ష్యాలెందుకూ? ప్రస్తుతం అధికారంలోఉన్న పాలకులకు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అంటే గిట్టదు. ఎందుకంటే ఒకరకమైన న్యూనతాభావం. అల్లకల్లోలంగాఉన్న ఆనాటి దేశాన్ని ఆయన తన వివేకంతో, దార్శనికతతో ప్రగతిశీల దృక్పధంతో ముందుకు నడిపారు. ఇప్పటి ఈ ప్రభుత్వం ఏం చేసిందీ? స్థిరంగా ఉన్న దేశాన్ని అస్తిరపరిచింది. సామాన్యుడి బతుకు బజారుపాలు చేసి, కార్పొరేట్లకు భజనచేస్తూ, తన్మ యత్వంలో తేలిపోతోంది. దీన్నే దేశభక్తిగా భావించాలని దేశప్రజలకుఉద్బోధిస్తోంది. దేశం ఎంత వెనక్కిపోతోందో చూసుకుందామన్న స్పృహకూడా లేదు. వైజ్ఞానిక దార్శనికుడు,నిరీశ్వరవాది, రచయిత, పరిపాలనాదక్షుడు అయిన పండిట్‌ నెహ్రూకు సంబంధించిన వార్తఆయన వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తోంది. ఇది 1954 ఏప్రిల్‌ 12 ఆంధ్రపత్రిక డైలీ ప్రచురించిన వార్త` ‘‘అహ్మదాబాదు, ఏప్రిల్‌ 10 అహ్మదాబాదు వస్త్రపారిశ్రామిక పరిశోధనా కేంద్రం భవనానికి నెహ్రూజీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు పురోహితుడు మంత్ర పఠనం మొదలు పెట్టాడు. నెహ్రూజీ సౌమ్యంగా ఆపమని సైగ చేశాడు. తెలివిలేని పురోహితుడు విషయం గ్రహించకుండా శ్లోకాలు పఠిస్తూ, నెహ్రూకు తిలకం దిద్దాలని ప్రయత్నించాడు. ఆయన చికాకు పడి ‘‘ఈ గోల నేను భరించలేను. ఏమిటిదంతా నాన్సెన్స్‌ అంటూ అడ్డుగాఉన్న పురోహితుణ్ణి పక్కకునెట్టి చరచరా భవనంలోకి నడిచి వెళ్లిపోయాడు. ‘‘దేశం వైజ్ఞానికంగా ముందుకు పోవాలనుకునేవారి చర్యలు ఏ విధంగా ఉండాలో…ఆయన ఆనాడే చేసి చూపించారు.
కేంద్రసాహిత్య అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img