వైశాలి బసు శర్మ
21వ శతాబ్దిలో మొదటి రెండు దశాబ్దాలలో అంతర్జాతీయంగా విస్తరించిన వాణిజ్యం మేలైన జీవనప్రమాణాలకు దారి తీసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా ముందుకు వచ్చిన సమస్యలు ప్రమాదకరంగానే ఉన్నాయి. కోవిడ్`19 మహమ్మారిలాంటి ప్రమాదాలు, వాతావరణ మార్పులు, సంఘర్షణలు, పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, అసమానతలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయాలలో కూడా మార్పులు సంభవించాయి. మితిమీరిన ప్రపంచీకరణ, నయా ఉదారవాద ఆర్ధిక రంగం క్రమంగా అంతరించనున్నాయి. చైనా విద్యుత్ వాహనాలపై అమెరికా విధించిన సుంకాలు స్వీయరక్షణపైన విస్త్రతంగా చర్చలు జరుగుతున్నాయి. ఒక దశాబ్దిక్రితం అనేక దేశాలు స్వేచ్ఛా వాణిజ్యానికి ఆసక్తి కనపరచాయి. ఇందుకు సరిహద్దులు లేవు. అలాగే పెట్టుబడులకు సరిహద్దులు లేవు. ఆర్థిక వృద్ధికి అంతర్జాతీయ రంగం ఎక్కువ దోహదం చేస్తుందన్న భ్రమ ఏర్పడిరది. కొన్ని ప్రాంతాలలో ఇది జరిగింది కూడా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితిఉన్నదా…అనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం అనేక దేశాలలో ఇదిపెద్ద చర్చగానూ, ప్రశ్నగానూ ఉన్నది.ఇప్పుడు ప్రపంచదేశాలు అనేకం స్వీయరక్షణవాదాన్ని ముందుకు తెచ్చాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపైన అమెరికా అధ్యక్షుడు చాలా ఎక్కువగా సుంకాలు విధిస్తున్నారు. చైనా విద్యుత్ వాహనాలపైన 100శాతం సుంకం విధించడం స్వీయరక్షణ వాదానికి మరింత ఊతమిచ్చింది. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలను అమెరికా కార్మికులే నిర్మించాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.
ఐరోపాలోనూ, అమెరికా అనుసరిస్తున్న విధానాలనే అనుసరించాలని కోరుకుంటున్నది. న్యూజెర్సీ ప్రాంతంలో ఏప్రిల్ 9న అమెరికా కాంపిటీషన్ చీఫ్ మార్గరెట్ వెస్ట్గర్ మాట్లాడుతూ, చైనా సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి పరిశ్రమలో ఆధిక్యత చూపుతున్నదని అన్నారు. దీనివల్ల కంపెనీలు కేవలం మూడుశాతానికిలోపు సోలార్ప్యానెల్స్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే విద్యుత్ వాహనాలపైన సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం తమకు సాధ్యంకాదని ఆమె అన్నారు. విండ్ప్యానెల్స్, అవసరమైన చిప్స్ను కూడా తయారుచేసే పరిస్థితిలోలేమని అమె చెప్పారు. చైనా పెద్దఎత్తున చౌకగా విద్యుత్ వాహనాలను సోలార్ ప్యానెల్స్ను ఉత్పత్తిచేసి భారీగా ఎగుమతి చేస్తున్నది. ఈ పరిణామం వల్ల తాము వీటి ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవాలనే ఆలోచన ఏర్పడిరది. దేశీయ డిమాండ్ పెరుగుతున్నది. ప్రపంచమంతటా ఉత్పత్తి పోటీదారులు పెరిగిపోయి స్వీయరక్షణకు పూనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చైనా చౌకగా ఉత్పత్తిచేసే వస్తువులు అత్యధికంగా లభిస్తున్నాయి. ఈ ఉత్పత్తులకు చైనా ప్రభుత్వం కూడ ప్రోత్సహిస్తున్నది. దేశీయ డిమాండ్కంటే చాలాఎక్కువగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ పరిణామాలు అనేక దేశాలకు పెద్ద ప్రశ్నార్థకమైంది. గత కొద్ది వారాలుగా బ్రెజిల్, చిలీ, మెక్సికో ఇతర లాటిన్ అమెరికా దేశాలు చైనా స్టీలు ఉత్పత్తులపై నిషేధిత సుంకాలను విధిస్తున్నాయి. కొలంబియా కూడా ఈ దేశాల మార్గాన్నే అనుసరించే అవకాశం కనిపిస్తున్నది.
దాదాపు దశాబ్ది క్రితం నుంచి చైనా స్టీలు ఉత్పత్తులను చౌకగా తయారుచేసి ప్రపంచ మార్కెట్లకు అధికంగా సరఫరా చేస్తున్నది. 2018లో అధ్యక్షుడుగా ఉన్న ట్రంప్ వందలాది డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపైన 1974లో చేసిన అక్రమ వ్యాపారాల చట్టంలోని 301సెక్షన్ కింద అధిక సుంకాలను విధించారు. ఇవి రెండు దేశాలమధ్య వాణిజ్య పోరాటాన్ని తీవ్రతరం చేసింది. ఏప్రిల్లో అమెరికా ఆర్థికమంత్రి జెన్నెట్టి ఎల్లెన్ బీజింగ్, గియాంగ్జులలో ఐదురోజులు పర్యటించి పరిశ్రమల సామర్ధ్యానికి మించి ఉత్పత్తి చేయడంవల్ల వాతావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, పరిశుభ్రతలేని ఇంధన శక్తి వస్తువులు అంగీకార యోగ్యంకాదని అన్నారు. అయితే తాజాగా చైనా ఉత్పత్తులపైన ట్రంప్ హయాంలో విధించిన సుంకాలను విధించడం నిలిపి వేస్తున్నామని చెప్పారు. గత వారం బైడెన్ ప్రభుత్వం చైనా దిగుమతి ఉత్పత్తులను ప్రత్యేకంగా గుర్తింపునిచ్చి 18 బిలియన్ డాలర్ల చైనా వస్తువుల దిగుమతులపై అదనంగా సుంకాలను విధించారు. విద్యుత్ వాహనాల, సోలార్ పానెల్స్, సెమికండక్టర్లు, మెడికల్ ఉత్పత్తులపై అదనపు సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తిదారులు కార్మికుల ప్రయోజనాల కోసమే కీలకరంగాల్లో ఉత్పత్తులపైన ఈ విధానాన్ని అమలు జరుపుతామని అమెరికా తెలిపింది.
ఈ నేపధ్యంలోనే అనేక దేశాలలో స్వీయరక్షణవాదం ముందుకు వచ్చింది. అందువల్ల ఆర్థిక జాతీయవాదం విస్తరించింది. ప్రపంచమంతటా పెద్దదేశాలు మితిమీరిన ఈర్ష్య వాణిజ్యం, పారిశ్రామిక విధానం, సాంకేతిక జాతీయవాదం, వాణిజ్యఆంక్షలు లాంటి వాటితో స్వీయరక్షణ పద్ధతులను అనుసరిస్తున్నాయి. రాజకీయ నిర్ణయాలు తీసుకునేందుకు ఆర్థిక వనరులు ప్రధాన శక్తిగా పనిచేస్తున్న పరిణామాలు ఇంతవరకు ఉన్నాయి. ఉత్పత్తిరంగానికి రాజకీయాలే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. సరళీకరణ పిడివాదానికి పూర్తి భిన్నంగా విధానాలను ఆయా దేశాలు అనుసరిస్తున్నాయి. ప్రపంచీకరణ సమ్మిళితత్వాన్ని సాధించడంలో విఫలమైనందున ప్రస్తుతం ప్రపంచమంతటా ఆర్థిక జాతీయవాదానికి ఆస్కారాన్నిచ్చింది. స్వీయరక్షణ వాదానికి సుంకాలు సాధనంగా మారుతున్నాయి. అనేక చోట్ల ఎగుమతులు, దిగుమతులు, సాంకేతికత, పెట్టుబడుల రద్దు అమలవుతున్నాయి. ఇవన్నీక్రమంగా దుందుడుకు ఆర్థిక జాతీయవాదానికి దారితీయవచ్చు. గ్రీన్, వైజ్ఞానిక సాంకేతికతలు, పునర్నిర్వచిస్తున్న ఆర్థిక చట్రాలు అంతర్జాతీయ సంబంధాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. కొత్త పరిణామాలు అమెరికా చిప్స్ చట్టం, ద్రవ్యోల్బణం తగ్గింపుచట్టం, ఐరోపా నెట్ జీరో చట్టం చేయడానికి దోహదంచేశాయి.ఇదే సందర్భంలో చైనా భారీగా కొత్త ఆవిష్కరణ ప్రాజెక్టులను చేపట్టింది. ఆర్థికవృద్ధి, సామాజిక ప్రగతి, వాతావరణ సుస్థిరత లాంటివి నేడు ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.