Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉపాధిపనులను పరిశీలించిన ఏపీఓ ఉమామహేష్

విశాలాంధ్ర వలేటివారిపాలెం : జాతీయగ్రామీణఉపాధి హామీ పనులను ఏపీఓ ఉమామహేష్ పరిశీలించారు. మండలంలోని వలేటివారిపాలెం గ్రామంలో జరుగుతున్న పూడికతీత పనులను మంగళవారం పరిశీలించారు. మస్టర్లను చదివి వినిపించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పనులకు మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు,ఎం త వేతనం వస్తుందిఅని వివరాలు కూలీలను అడిగి తెలుసుకొన్నారు.మీరు పనులకు ఒకరిపై ఒకరు బదులు రావద్దని కూలీలకు సూచించారు.ఉపాధి పనులు నాణ్యతగా ఉండాలని అన్నారు.వంద రోజులు దాటని వారు పని అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని పీల్డ్ అసిస్టెంట్ దాసరి సింహాద్రి కి చెప్పారు.ఉపాధిహామీ పనులలో ప్రతి కుటుంబం పాల్గొనే విదంగా చూడాలని అన్నారు.పనులతనిఖీలో టీఏ ప్రసాదు, సీనియర్ మేట్ దండెబోయిన కిషోర్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img