Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఆదర్శ కమ్యూనిస్టు పార్టీ నాయకులు దాసరి రామారావు

విశాలాంధ్ర – సంతనూతలపాడు : పేర్న మిట్ట గ్రామ శాంతినగర్ కు చెందిన ఆదర్శ కమ్యూనిస్టు పార్టీ నాయకులు దాసరి రామారావు తన నివాసం వద్ద శనివారం మృతి చెందారు. మృతి సంఘటన తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సందర్శించి భౌతిక గాయానికి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ దాసరి రామారావు సిపిఐ పార్టీ కౌన్సిల్ సభ్యులుగా, ప్రజానాట్యమండలి కళాకారుడుగా, శాంతినగర్ కార్యదర్శిగా నిరంతరం పేదల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ రామారావు అని కొనియాడారు ,నివాళులు అర్పించిన వారిలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకటరావు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆర్ రామకృష్ణ, సిపిఐ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యదర్శి నల్లూరి మురళి, మండల కార్యదర్శి ముత్తల అంజయ్య, సిపిఐ పార్టీ నాయకులు రాముడు, వాసు మోహన్ నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు, పెదబాబు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img