Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అంబేద్కర్ ఖ్యాతి విశ్వవ్యాప్తి

విగ్రహ నిర్మాణ ధమ్మపూజలో ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్
విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- ప్రపంచ జ్ఞాని అయిన అంబేడ్కర్ ఖ్యాతి విశ్వ వ్యాప్తి గా ఉందని ఎస్సీ కమీషన్ రాష్ట్ర చైర్మన్ : మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేద్కర్ మిషన్ అధ్వర్యంలో నాగులుప్పలపాడు. కూడలిలో నిర్మాణం తలపెట్టిన అంటేడ్కర్ విగ్రహ నిర్మాణం కు శనివారం ధమ్మపూజ కార్యక్రమంను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, స్టేట్ ప్రత్యేకాధికారి యాదల అశోక్ బాబుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ అంబేడ్కర్ చూపించిన బోధించు, సమీకరించు, పోరాడు అనే స్పూర్తి తో ప్రజల్లో చైతన్యం ఇంకా వెల్లువెత్తి రాజ్యాధికారం వైపు పాటుపడాలన్నారు. ఆరోగ్యశ్రీ ప్రత్యేకాధికారి డా. యాదల అశోక్ బాబు మాట్లాడుతూ ఎంతో చైతన్యవంతమైన నాగులుప్పలపాడు మండలంలో ఇప్పటి వరకు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని అపరాధ భావం ఉండేదని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విగ్రహ నిర్మాణంకు దమ్మపూజ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ కాలనీ లోని బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బౌద్ధ బిక్షువు సంఘజీవి. పాలడుగు విజయేంద్ర, చార్వాక, కాకుమాను డేవిడ్, తెలగతోటి శ్యామ్యూల్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img