విశాలాంధ్ర -వలేటివారిపాలెం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రప్రజలు సుబిక్షంగా ఉండాలని మాలకొండ మాల్యాద్రి లక్ష్మినరసింహ స్వామి ని ప్రార్దించానని జడ్పిటీసీ ఇంటూరి భారతి అన్నారు. శనివారం ఆమె లక్మినరసింహస్వామిని దర్శించుకున్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళాపక్షపాతి అని ఆయన శాశ్విత ముఖ్యమంత్రిగా ఉండాలని,మాలకొండ లక్ష్మీనసింహస్వామి ఆశీస్సులు రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రప్రజలపై ఉండాలని స్వామివారిని ప్రార్దించానని తెలిపారు స్వామి దర్శనం అనంతరం ప్రతి శనివారం స్వామి సన్నిధిలో జరిగే అన్నదానకార్యక్రమంలో భక్తులకు ఆహారపదార్థాలను సేవకురాలిగా వడ్డించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో భక్తులకు సేవలందించడం ఎంతో తృప్తి ని ఇస్తుందని ఈ సందర్బంగా జడ్పిటీసీ ఇంటూరి భారతి అన్నారు