న్యూదిల్లీ : హాకీని జాతీయ క్రీడగా అధికారికంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై తాము ఏమీ చేయలేమని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడను ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదని.. మనకు జాతీయ జంతువు ఉన్నప్పుడు జాతీయ క్రీడ ఎందుకు ఉండకూడదని పిటిషనర్ తరఫు న్యాయవాది విశాల్ తివారీ ధర్మాసనం ముందు తన వాదన వినిపించారు. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని.. పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని లేదంటే తామే రద్దు చేస్తామని జస్టిస్ లలిత్ వ్యాఖ్యానించారు. దీంతో న్యాయవాది విశాల్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.