Sunday, May 19, 2024
Sunday, May 19, 2024

టీమిండియాకు భారీ జరిమానా

శుభ్‌మన్‌ గిల్‌కు అదనంగా

న్యూదిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌ (డబ్ల్యూ టీసీ) ఫైనల్‌ పోరులో పరాజయాన్ని మూట గట్టుకున్న టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. టీమిండియా మొత్తానికి మ్యాచ్‌ ఫీజులో 100శాతం కోత విధిస్తున్నట్లు వెల్లడిర చింది. అటు టైటిల్‌ గెలిచిన ఆస్ట్రేలియా కూ జరిమానా తప్పలేదు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు వారి మ్యాచ్‌ ఫీజులో 80శాతం కోత విధించింది. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్ణీత సమయంలో భారత్‌ 5 ఓవర్లు, ఆస్ట్రేలియా 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేశాయని ఐసీసీ వివరించింది.
ఇక భారతజట్టు ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌కు అదనపు జరిమానా పడిరది. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ ఔట్‌ అయిన తర్వాత అంపైర్‌ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు గాను మ్యాచ్‌ ఫీజులో 15శాతం కోత విధించారు. దీంతో కలిపి గిల్‌కు మొత్తంగా 115శాతం జరిమానా పడిర దన్నమాట. రెండో ఇన్నింగ్స్‌లో గిల్‌ (18) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. బొలాండ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ మొదటి బంతిని స్లిప్‌లో కామెరూన్‌ గ్రీన్‌ ఒంటి చేత్తో క్యాచ్‌ అందు కున్నాడు. అయితే, ఈ క్యాచ్‌ వివాదస్పదంగా మారింది. బంతి నేలకు తాకిన తర్వాత గ్రీన్‌ అందుకున్నట్లు స్పష్టంగా కనిపించింది. కానీ మూడో అంపైర్‌ ఔట్‌గా ప్రక టించడంతో గిల్‌ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. దీనిపై గిల్‌ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. మూడో అంపైర్‌కు కళ్లు సరిగ్గా కనిపించలేదా? అనే అర్థం వచ్చేలా ఎమోజీలు పోస్ట్‌ చేశాడు.
దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గిల్‌కు అదనపు జరిమానా విధించారు. ‘గిల్‌ ఔట్‌ విషయంలో టెలివిజన్‌ అంపైర్‌ ఇచ్చిన నిర్ణయం సరైందే. ఆ తర్వాత రోజు గిల్‌ ఈ నిర్ణయాన్ని ప్రస్తా విస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశాడు. ఐసీసీ ఆర్టికల్‌ 2.7 నిబంధన కింద అతడు చేసింది తప్పిదమే’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img