విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుండి 12వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న 14వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ పోటీలలో పాల్గొనేందుకు శ్రీ సత్య సాయి జిల్లా హాకీ టీం ను శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి, హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు బి. సూర్యప్రకాష్ ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ఈనెల మూడవ తేదీ బుధవారం స్థానిక ప్రభుత్వ బాలుర గ్రౌండ్ నందు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో రాష్ట్ర జట్టు సభ్యులుగా లోకేష్- కెప్టెన్, మహమ్మద్ రఫీ, జగన్, ఈశ్వర్, మహబూబ్ బాషా, బాల ఓబులేసు, భరత్ కుమార్, మనోజ్ కుమార్, అభిషేక్, అనిల్ కుమార్, దుర్గాప్రసాద్, లవన్ కుమార్, దయాసాగర్, ఫజులుద్దీన్ శబరిష్ గౌడ్, రితీష్, వెంకట అభిషేక్తి ,గవ్వల మధులు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ జట్టుకు కోచ్గా హసేన్, మేనేజర్ గా షేక్షావలి, టోర్నమెంట్ అంపైరుగా ధర్మారం నుండి సాయి కుమారులు వ్యవహరిస్తారని తెలిపారు. తిరుపతిలో కూడా హాకీ జట్టు మంచి ప్రతిభను కనపరచాలని వారు తెలియజేశారు.