మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని దినసరి వారపు మార్కెట్ జంతువదశాల కు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం బహిరంగ వేలమ్ పాటను కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో జరిగాయి. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొత్తం ముగ్గురు వేలంపాటిదారులు పాల్గొన్నారని, ఇందులో దినసరివారపు మార్కెట్ వేలంపాటను రాఘవరెడ్డి 60 లక్షల 50 వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగిందన్నారు. సర్కారు పాటగా 59 లక్షలు పాడటం జరిగిందన్నారు. అదేవిధంగా జంతువదశాల కు సర్కార్ పాట ఒక లక్ష 5000 పాడగా ఖాజాముద్దీన్ ఒక లక్ష 15 వేలకు వేలం పాట పాడి దక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఆనంద్ కుమార్, ఏ వన్ వెంకటరమణ పాల్గొన్నారు.