శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ పెద్దిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ సత్య కృప మహిళా డిగ్రీ కళాశాలలో అల్ట్రస్ట్ కంపెనీవారు ప్రస్తుతం కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీలకు కంపెనీవారు డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో నూరు మంది విద్యార్థులు పాల్గొనగా 26 మంది ఎంపిక కావడం జరిగిందని కరెస్పాండెంట్ పెద్దిరెడ్డి తెలిపారు. అనంతరం కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థులు డిగ్రీ చదువుకుంటూ ఇటువంటి కంపెనీ డ్రైవ్ లో పాల్గొనడం ఎంతో ఉపయోగమని, ఎంపికైన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎంపిక కాకుండా డ్రైవ్ లో పాల్గొన్న వారికి అనుభవం వస్తుందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా చక్కటి చదువును చదువుతూ ఇటువంటి కంపెనీల యొక్క ఇంటర్వ్యూలకు, కంపెనీ డ్రైవర్లకు పాల్గొంటే మంచి నైపుణ్యం, అనుభవం వస్తుందని భవిష్యత్తులో మరిన్ని పోటీలకు ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపక బృందం ఎంపికైన విద్యార్థినిలను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది తరుణ్ కుమార్, నాగేంద్ర, పాల్గొన్నారు.