విశాలాంధ్ర- జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఆచార్య కృష్ణయ్య శనివారం పరిపాలన భవనంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇన్చార్జి వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ వి సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ అరుణ క్రాంతి, ఆచార్య భానుమూర్తి,ఆచార్య శశిధర్, డైరెక్టర్లు , బోధన, బోధనేతర సిబ్బంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య మాట్లాడుతూ.. జేఎన్టీయూఏ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశయ స్ఫూర్తిగా .. స్కిల్ డెవలప్మెంట్ సిమెన్స్ ను పునరుద్ధరించి ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాల ప్రగతి, ఉపాధి కల్పన, పరిశోధనాత్మక ప్రగతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో విశ్వవిద్యాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపి.. ఉద్యోగులందరూ సమిష్టి కృషి, పూర్వ విద్యార్థులు, మేధావుల ఆలోచనలను అమలు చేస్తూ.. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక, పారిశ్రామిక ఐటీ రంగంలో వస్తున్న మార్పులను దీటుగా ఎదుర్కొనేలా విద్యార్థులను సన్నద్ధత చేస్తామన్నారు.