విశాలాంధ్ర – ధర్మవరం : వయోజన బీసీజీ టీకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని డాక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రావులచెరువు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర లో ఎఫ్ బి సి వైద్య చికిత్స పొందాలని తెలిపారు. వయోజన బీసీజీ టీకాలపై ప్రజలు అవగాహన చేసుకోవాలన్నారు. ఈ టీకా ను 60 సంవత్సరాలు దాటిన వారికి, చక్కెర వ్యాధిగ్రస్తులకు, పొగాకు, సిగరెట్లు, తాగు వారికి, బరువు తక్కువ గల వారికి, టీబివ్యాధి గతంలో వచ్చి నయమైన వారికి, వారి ఇంటి కుటుంబ సభ్యులుకు అందరకు కూడా వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ టీకా వేయడం వలన వ్యాధి నిరోధక శక్తి పెంచుతూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భవతులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య చికిత్సలు పొందాలని, వివిధ పరీక్షలు చేయించుకోవాలని, గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పౌష్టిక ఆహారం గురించి కూడా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమములో మేలు మేరా అసిస్టెంట్ బ్రహ్మానందం రెడ్డి, ఏఎన్ఎం రేణుక, ఎమ్మెల్యే హెచ్పి పరిమళ, ప్రవీణ్ కుమార్, ఆశా వర్కర్లు సావిత్రమ్మ, సరస్వతి, నాగేంద్రమ్మ, నారమ్మ పాల్గొన్నారు.